యాప్నగరం

ఫస్ట్ టెస్టులోనే పృధ్వీషా హాఫ్ సెంచరీ..!

సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున అరంగేట్రం టెస్టులో అర్ధశతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా పృధ్వీ షా నిలిచాడు.

Samayam Telugu 4 Oct 2018, 11:13 am
వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో యువ ఓపెనర్ పృధ్వీ షా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న 18 ఏళ్ల పృధ్వీ షా ఎలాంటి తడబాటు లేకుండా.. 56 బంతుల్లో 7x4 సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున అరంగేట్రం టెస్టులో అర్ధశతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా పృధ్వీ షా నిలిచాడు. 1959లో 20 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన అబ్బాస్ అలీ అర్ధశతకంతో మెరిశాడు. మళ్లీ ఇన్నాళ్లకి పృధ్వీ షా ఆ రికార్డుని బద్దలుకొట్టాడు.
Samayam Telugu india vs west indies 1st test day 1 shaw scores half century on debut
ఫస్ట్ టెస్టులోనే పృధ్వీషా హాఫ్ సెంచరీ..!


మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) ఆరంభంలోనే డకౌటై నిరాశపరిచాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారా (40: 54 బంతుల్లో 7x4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్ నడిపించిన పృధ్వీ షా తొలి టెస్టులోనే తన మార్క్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ జోడీ రెండో వికెట్‌కి 98 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో కొనసాగుతోంది. దీంతో భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 102/1తో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.