యాప్నగరం

వెస్టిండీస్‌పై శతకం బాదిన పృథ్వీ షా..!

భారత్ తరఫున టెస్టుల్లో పిన్న వయసులో సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా 18 ఏళ్ల పృథ్వీ షా నిలిచాడు. 1990లో ఇంగ్లాండ్‌పై 17 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు.

Samayam Telugu 4 Oct 2018, 1:05 pm
అరంగేట్రం టెస్టులోనే భారత యువ ఓపెనర్ పృథ్వీ షా శతకంతో చెలరేగాడు. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో పృథ్వీ షా 99 బంతుల్లోనే 15x4 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో పిన్న వయసులో సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా 18 ఏళ్ల పృథ్వీ షా నిలిచాడు. 1990లో ఇంగ్లాండ్‌పై 17 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు.
Samayam Telugu 724864-icc


మ్యాచ్‌లో పృథ్వీ షాతో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (80 బ్యాటింగ్: 103 బంతుల్లో 13x4) కూడా దూకుడుగా ఆడుతుండటంతో భారత్ జట్టు 36 ఓవర్లు ముగిసే సమయానికి 189/1తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. జట్టు స్కోరు 3 వద్దే ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) డకౌటవగా.. అనంతరం పుజారాతో కలిసి పృథ్వీ షా రెండో వికెట్‌కి అభేద్యంగా 212 బంతుల్లో 186 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.