యాప్నగరం

టెస్టుల్లో భారత్‌కి ఇదే అతిపెద్ద గెలుపు

ఈ ఏడాదిలో ఇన్నింగ్స్ 250+ స్కోరు తేడాతో కోహ్లీసేన గెలుపొందడం ఇది రెండోసారి.

Samayam Telugu 6 Oct 2018, 5:18 pm
సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు రికార్డు స్థాయి గెలుపుని శనివారం అందుకుంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో ఈరోజు ముగిసిన టెస్టు మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో భారత్‌కి ఇదే అతిపెద్ద గెలుపుకాగా.. ఈ ఏడాదిలోనే ఇన్నింగ్స్ 250+ స్కోరు తేడాతో కోహ్లీసేన గెలుపొందడం ఇది రెండోసారి.
Samayam Telugu india vs west indies 1st test indias biggest wins by an innings in tests
టెస్టుల్లో భారత్‌కి ఇదే అతిపెద్ద గెలుపు


టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో భారత్ జట్టు గెలుపొందిన మ్యాచ్‌లను ఓ సారి పరిశీలిస్తే..! ఈరోజు రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన మ్యాచ్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఈ ఏడాదే బెంగళూరు వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో గెలుపొందిందిన మ్యాచ్ నిలిచింది. ఇక మూడో స్థానంలో.. 2007లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో గెలుపొందిన మ్యాచ్ ఉండగా.. నాలుగో స్థానంలో 2017లో నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్‌ నిలిచింది. ఐదో స్థానంలో 1998లో ఆస్ట్రేలియాపై కోల్‌కతా వేదికగా ఇన్నింగ్స్‌ 219 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.