India vs West Indies సిరీస్ షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్, వైజాగ్లో మ్యాచ్లు
భారత్ గడ్డపైకి టీ20, వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు రాబోతోంది. టెస్టుల్లో గత కొంతకాలంగా తేలిపోతున్న కరీబియన్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం మంచి జోరుమీదున్నారు. దీంతో.. సిరీస్ హోరాహోరీగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
Samayam Telugu 23 Nov 2019, 1:18 pm
ప్రధానాంశాలు:
- డిసెంబరు 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్ మొదలు
- మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న రెండు జట్లు
- తొలి టీ20కి హైదరాబాద్, రెండో వన్డేకి వైజాగ్ ఆతిథ్యం
- వెస్టిండీస్ జట్టులోకి మళ్లీ సీనియర్లు రీఎంట్రీ ఇచ్చే అవకాశం
బంగ్లాదేశ్తో ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్ జట్టు డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్ల షెడ్యూల్ని రూపొందించింది. డిసెంబరు 6న మొదలుకానున్న ఈ సిరీస్లో రెండు జట్లు మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేల్ని 22వ తేదీ వరకూ ఆడనున్నాయి. Read More: Test Rankingsలో మహ్మద్ షమీ, మయాంక్ పైపైకి..!
భారత్, వెస్టిండీస్ మధ్య డిసెంబరు 6న హైదరాబాద్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత 8న తిరువనంతపురంలో రెండో టీ20 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక ఆఖరి టీ20 మ్యాచ్కి 11న వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం డిసెంబరు 15న చెన్నై వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. 18న విశాఖపట్నం వేదికగా రెండో వన్డే, ఇక ఆఖరి వన్డేకి కటక్ 22న ఆతిథ్యమివ్వబోతోంది. టీ20 మ్యాచ్లు రాత్రి 7 గంటలకి ప్రారంభంకానుండగా.. వన్డేలు మధ్యాహ్నం 2 నుంచి మొదలుకానున్నాయి.
Read More: ఇదేం బౌలింగ్ యాక్షన్ గురూ..? (వైరల్ వీడియో)
భారత్ గడ్డపై ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న వెస్టిండీస్ క్రికెటర్లు ఈ సిరీస్లో టీమిండియాకి గట్టి పోటీనిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ టూర్ కోసం సీనియర్ క్రికెటర్లకి కూడా జట్టులో చోటివ్వాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు యోచిస్తుండటంతో.. సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
Read More: ధోనీలా రనౌట్ చేయబోయి బోల్తాకొట్టిన వికెట్ కీపర్
భారత్, వెస్టిండీస్ మధ్య డిసెంబరు 6న హైదరాబాద్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత 8న తిరువనంతపురంలో రెండో టీ20 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక ఆఖరి టీ20 మ్యాచ్కి 11న వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం డిసెంబరు 15న చెన్నై వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. 18న విశాఖపట్నం వేదికగా రెండో వన్డే, ఇక ఆఖరి వన్డేకి కటక్ 22న ఆతిథ్యమివ్వబోతోంది. టీ20 మ్యాచ్లు రాత్రి 7 గంటలకి ప్రారంభంకానుండగా.. వన్డేలు మధ్యాహ్నం 2 నుంచి మొదలుకానున్నాయి.
Read More: ఇదేం బౌలింగ్ యాక్షన్ గురూ..? (వైరల్ వీడియో)
భారత్ గడ్డపై ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న వెస్టిండీస్ క్రికెటర్లు ఈ సిరీస్లో టీమిండియాకి గట్టి పోటీనిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ టూర్ కోసం సీనియర్ క్రికెటర్లకి కూడా జట్టులో చోటివ్వాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు యోచిస్తుండటంతో.. సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
Read More: ధోనీలా రనౌట్ చేయబోయి బోల్తాకొట్టిన వికెట్ కీపర్