యాప్నగరం

వైజాగ్‌: కోహ్లి తప్పిదం.. ఒక పరుగు కోత

అంపైర్ నిర్ణయంతో తన తప్పుని గ్రహించిన కోహ్లి.. మైదానంలో గట్టిగా అరుస్తూ కొన్ని క్షణాలు అసహనానికి గురయ్యాడు.

Samayam Telugu 25 Oct 2018, 1:00 pm
వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో శతకం బాది ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికైన విరాట్ కోహ్లి.. మ్యాచ్ మధ్యలో ఓ చిన్న తప్పిదం చేశాడు. దీంతో.. అతను రెండు పరుగులు చేసినా.. అంపైర్ ఒక పరుగు కోత విధించాడు. అంపైర్ నిర్ణయంతో తన తప్పుని గ్రహించిన కోహ్లి.. మైదానంలో గట్టిగా అరుస్తూ కొన్ని క్షణాలు అసహనానికి గురయ్యాడు.
Samayam Telugu 00


మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13x4, 4x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే.

ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన స్పిన్నర్ నర్స్ బౌలింగ్‌లో బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసిన విరాట్ కోహ్లి.. అంబటి రాయుడితో కలిసి వికెట్ల మధ్య రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే.. బంతిని చూస్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని క్రీజులోపలికి బ్యాట్ పెట్టకుండా.. లైన్‌కి ఇవతలే బ్యాట్‌ని పెట్టి రెండో పరుగుకి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన ఫీల్డ్ అంపైర్.. ఒక పరుగు కోత విధించాడు. అప్పటికి విరాట్ కోహ్లి స్కోరు 20 బంతుల్లో 13కాగా.. భారత్ 10 ఓవర్లలో 49/2తో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.