యాప్నగరం

ఉప్పల్ టెస్టులో టీ బ్రేక్‌కి భారత్ 173/4

తొలి సెషన్‌లో పృథ్వీ షా ధాటికి తేలిపోయిన వెస్టిండీస్ బౌలర్లు.. రెండో సెషన్‌లో ఫర్వాలేదనిపించారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేసినా.. ఎట్టకేలకి జట్టు స్కోరు 98 వద్ద పృథ్వీ షా‌ని పెవిలియన్ బాట పట్టించారు.

Samayam Telugu 13 Oct 2018, 2:43 pm
వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఈరోజు కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తోంది. పృథ్వీ షా (70: 53 బంతుల్లో 11x4, 1x6) అర్ధశతకం బాదడంతో తొలి సెషన్‌ని 80/1తో ముగించిన టీమిండియా.. టీ విరామ సమయానికి 173/4తో ఒత్తిడిలో పడింది. రెండో సెషన్‌లో అర్ధశతకం బాదిన పృథ్వీ షా‌తో పాటు చతేశ్వర్ పుజారా (10), కెప్టెన్ విరాట్ కోహ్లి (45: 78 బంతుల్లో 5x4) వికెట్లను భారత్ చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజులో అజింక్య రహానె (19 బ్యాటింగ్: 78 బంతుల్లో 1x4), రిషబ్ పంత్ (9 బ్యాటింగ్: 13 బంతుల్లో 2x4) ఉండగా.. ఇంకా 138 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. వెస్టిండీస్ జట్టు ఈరోజు ఉదయం 311 పరుగులకి మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌటైన విషయం తెలిసిందే.
Samayam Telugu 4 at tea trail west indies by 138 runs
ఉప్పల్ టెస్టులో టీ బ్రేక్‌కి భారత్ 173/4


తొలి సెషన్‌లో పృథ్వీ షా ధాటికి తేలిపోయిన వెస్టిండీస్ బౌలర్లు.. రెండో సెషన్‌లో ఫర్వాలేదనిపించారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేసినా.. ఎట్టకేలకి జట్టు స్కోరు 98 వద్ద పృథ్వీ షా‌ని పెవిలియన్ బాట పట్టించి బ్రేక్ అందుకున్న కరీబియన్ టీమ్.. ఆ తర్వాత 102 వద్ద పుజారాని బోల్తా కొట్టించింది. ఈ దశలో రహానెతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ నడిపించినా.. అర్థ శతకానికి చేరువైన కోహ్లీని జట్టు స్కోరు 162 వద్ద హోల్డర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఓపెనర్ రాహుల్ (4) తొలి సెషన్ ఆరంభంలోనే ఔటయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.