యాప్నగరం

హైదరాబాద్‌ టెస్టులో వెస్టిండీస్ 311 ఆలౌట్

ఆటలో తొలిరోజైన శుక్రవారం ఒకానొక దశలో 113/5తో నిలిచిన వెస్టిండీస్ జట్టుని అసాధారణ ఆటతో మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చిన రోస్టన్ చేజ్ ఎట్టకేలకి ఈరోజు శతకం మార్క్‌ని అందుకున్నాడు.

Samayam Telugu 13 Oct 2018, 10:51 am
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు 311 పరుగులకి ఈరోజు ఆలౌటైంది. ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 295/7తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన వెస్టిండీస్ జట్టులో రోస్టన్ చేజ్ (106: 189 బంతుల్లో 8x4, 1x6) శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బంతితో చెలరేగిన ఉమేశ్ యాదవ్ (6/88) వరుసగా బిషూ (2), రోస్టన్ చేజ్, గాబ్రిల్ (0) పెవిలియన్ బాట పట్టించడంతో.. తొలి సెషన్ ఆరంభంలోనే వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నిన్న కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ ఒక వికెట్ తీసిన విషయం తెలిసిందే.
Samayam Telugu chaseeeton


ఆటలో తొలిరోజైన శుక్రవారం ఒకానొక దశలో 113/5తో నిలిచిన వెస్టిండీస్ జట్టుని అసాధారణ ఆటతో మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చిన రోస్టన్ చేజ్ ఎట్టకేలకి ఈరోజు శతకం మార్క్‌ని అందుకున్నాడు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత బ్యాట్స్‌మెన్స్ ముగ్గురు ( పృథ్వీ షా, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా) శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌ తరఫున తాజాగా చేజ్‌ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. రెండేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు 24 టెస్టులాడిన రోస్టన్ చేజ్‌కి ఇది నాలుగో శతకం కాగా.. అతని ఖాతాలో 6 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.