వెస్టిండీస్తో టీ20 సిరీస్లో వేసిన తొలి బంతికే భారత మణికట్టు స్పిన్నర్ చాహల్ వికెట్ పడగొట్టాడు. చెన్నై వేదికగా ఈరోజు జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో ఇన్నింగ్స్ ఏడో ఓవర్, మ్యాచ్లో తానేసిన తొలి ఓవర్లోనే చాహల్ విండీస్ ఓపెనర్ షై హోప్ (24: 22 బంతుల్లో 3x4, 1x6)ని బోల్తా కొట్టించాడు. స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని షైహోప్ భారీషాట్లు ఆడుతుండటాన్ని గమనించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. చాహల్కి బంతినిచ్చి ఫలితం రాబట్టాడు. తొలి రెండు టీ20ల్లోనూ కుల్దీప్కి ఛాన్సిచ్చిన టీమిండియా మేనేజ్మెంట్ చాహల్ని రిజర్వ్ బెంచ్కే పరిమితం చేసిన విషయం తెలిసిందే.
ఏడో ఓవర్లో చాహల్ ఊరిస్తూ విసిరిన బంతిని షైహోప్ స్టాండ్స్లోకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతిని గాల్లోకి లేవగా.. వాషింగ్టన్ సుందర్ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ 9వ ఓవర్ వేసిన చాహల్.. ఆఖరి బంతికి మరో ఓపెనర్ హెట్మెయర్ (26: 21 బంతుల్లో 4x4, 1x6)ని కూడా బోల్తా కొట్టించాడు. ఈసారి ఆఫ్ స్టంప్కి వెలుపలగా విసిరిన బంతిని హెట్మెయర్ పాయింట్ దిశగా హిట్ చేశాడు. కానీ.. అది నేరుగా వెళ్లి బౌండరీ లైన్కి సమీపంలో ఉన్న కృనాల్ పాండ్య చేతుల్లో పడింది. దీంతో.. విండీస్ 9 ఓవర్లు ముగిసే సమయానికి 62/2తో నిలిచింది.
ఏడో ఓవర్లో చాహల్ ఊరిస్తూ విసిరిన బంతిని షైహోప్ స్టాండ్స్లోకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతిని గాల్లోకి లేవగా.. వాషింగ్టన్ సుందర్ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ 9వ ఓవర్ వేసిన చాహల్.. ఆఖరి బంతికి మరో ఓపెనర్ హెట్మెయర్ (26: 21 బంతుల్లో 4x4, 1x6)ని కూడా బోల్తా కొట్టించాడు. ఈసారి ఆఫ్ స్టంప్కి వెలుపలగా విసిరిన బంతిని హెట్మెయర్ పాయింట్ దిశగా హిట్ చేశాడు. కానీ.. అది నేరుగా వెళ్లి బౌండరీ లైన్కి సమీపంలో ఉన్న కృనాల్ పాండ్య చేతుల్లో పడింది. దీంతో.. విండీస్ 9 ఓవర్లు ముగిసే సమయానికి 62/2తో నిలిచింది.