భారత్తో ముంబయిలోని బ్రబౌర్న్ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ ఓటమికి కారణం రనౌట్సేనని ఆ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20x4, 4x6), మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8x4, 4x6) శతకాలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 36.2 ఓవర్లలో 153 పరుగులకే పేలవరీతిలో కుప్పకూలిపోయింది. ఛేదన ఆరంభంలోనే ఓపెనర్ కీరన్ పొవెల్ (4), షై హోప్ (0) రనౌట్ రూపంలో వెనుదిరగడం జట్టుని దారుణంగా దెబ్బతీసిందని హోల్డర్ చెప్పుకొచ్చాడు.
‘వన్డే, టీ20ల్లో రనౌట్స్ జట్టుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఛేదన ఆరంభంలోనే వరుసగా ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రనౌటవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మిగిలిన ఆటగాళ్లు కూడా సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. కనీసం ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మెరుగ్గా ఆడగలిగింటే..? ఛేదనలో భారత్కి పోటీనిచ్చేవాళ్లం. బౌలింగ్ సమయంలోనూ మా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేశారు. మరోవైపు ఛేదనలో వరుస రనౌట్లు కారణంగా.. ఆఖరి వరకూ కనీసం ఒక్కటి కూడా మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయాం’ అని హోల్డర్ వెల్లడించాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురం వేదికగా గురువారం ఐదో వన్డే జరగనుంది.
‘వన్డే, టీ20ల్లో రనౌట్స్ జట్టుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఛేదన ఆరంభంలోనే వరుసగా ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రనౌటవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మిగిలిన ఆటగాళ్లు కూడా సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. కనీసం ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మెరుగ్గా ఆడగలిగింటే..? ఛేదనలో భారత్కి పోటీనిచ్చేవాళ్లం. బౌలింగ్ సమయంలోనూ మా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేశారు. మరోవైపు ఛేదనలో వరుస రనౌట్లు కారణంగా.. ఆఖరి వరకూ కనీసం ఒక్కటి కూడా మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయాం’ అని హోల్డర్ వెల్లడించాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురం వేదికగా గురువారం ఐదో వన్డే జరగనుంది.