భారత్, వెస్టిండీస్ మధ్య ఈరోజు తిరువనంతపురంలో జరుగుతున్న ఐదో వన్డేలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 104 పరుగులకే ఆలౌటవగా.. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టులో రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5x4, 4x6) దూకుడుగా ఆడుతూ కనిపించాడు. కానీ.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ థామస్ బౌలింగ్లో బంతిని డిఫెన్స్ చేసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి విండీస్ వికెట్ కీపర్ షై హోప్ చేతుల్లో పడింది.
రోహిత్ శర్మ ఔటనుకుని బౌలర్ థామస్ సంబరాలు మొదలెట్టగా.. అతని వెనుక నుంచి నోబాల్ అంటూ ఫీల్డ్ అంపైర్ చెయ్యి లేపాడు. అంపైర్ నిర్ణయంతో షాక్కి గురైన.. బౌలర్ థామస్ పిచ్పైనే కూర్చిండిపోగా.. రోహిత్ శర్మ మాత్రం కీపర్ బంతిని పట్టగానే ఔటనుకుని నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి వేగంగా స్పందిస్తూ.. ‘రోహిత్ ఎక్కడికి వెళ్తున్నావు..? ఆ బంతి నోబాల్.. వెనక్కి వచ్చి బ్యాటింగ్ చెయ్’ అంటూ గట్టిగా అరుస్తూ సైగ చేశాడు. దీంతో.. మళ్లీ రోహిత్ వెనక్కి వచ్చిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ని కొనసాగించి కేవలం 14.5 ఓవర్లలోనే 105/1తో భారత్ని గెలిపించాడు.
రోహిత్ శర్మ ఔటనుకుని బౌలర్ థామస్ సంబరాలు మొదలెట్టగా.. అతని వెనుక నుంచి నోబాల్ అంటూ ఫీల్డ్ అంపైర్ చెయ్యి లేపాడు. అంపైర్ నిర్ణయంతో షాక్కి గురైన.. బౌలర్ థామస్ పిచ్పైనే కూర్చిండిపోగా.. రోహిత్ శర్మ మాత్రం కీపర్ బంతిని పట్టగానే ఔటనుకుని నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి వేగంగా స్పందిస్తూ.. ‘రోహిత్ ఎక్కడికి వెళ్తున్నావు..? ఆ బంతి నోబాల్.. వెనక్కి వచ్చి బ్యాటింగ్ చెయ్’ అంటూ గట్టిగా అరుస్తూ సైగ చేశాడు. దీంతో.. మళ్లీ రోహిత్ వెనక్కి వచ్చిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ని కొనసాగించి కేవలం 14.5 ఓవర్లలోనే 105/1తో భారత్ని గెలిపించాడు.