యాప్నగరం

ధావన్‌కే మళ్లీ ఛాన్స్.. పృథ్వీ షాకి షాక్

గౌహతిలో ముగిసిన తొలి వన్డేలో 4 పరుగులకే ఔటైన ధావన్.. నిన్న విశాఖపట్నంలో ముగిసిన రెండో వన్డేలో 29 పరుగులకే పెవిలియన్ చేరిపోయాడు. ఈ నేపథ్యంలో.. చివరి మూడు వన్డేలకి అతని స్థానంలో పృథ్వీ షా అవకాశం ఇవ్వాలనే సూచనలు పెరిగాయి.

Samayam Telugu 25 Oct 2018, 4:54 pm
వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేలకి అవకాశం దక్కుతుందని ఆశించిన యువ ఓపెనర్ పృథ్వీ షాకి ఈరోజు సెలక్టర్ల నుంచి మొండిచేయి ఎదురైంది. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా 134, 70, 33* పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో.. వన్డే సిరీస్‌లోనూ అతనికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ.. ఐదు వన్డేల సిరీస్‌కి రెండు సార్లు జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. రెండు సందర్భాల్లోనూ యువ ఓపెనర్‌కి ఛాన్సివ్వలేదు.
Samayam Telugu india vs west indies bcci announces squad for remaining 3 odis
ధావన్‌కే మళ్లీ ఛాన్స్.. పృథ్వీ షాకి షాక్


వెస్టిండీస్‌తో ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లోనూ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ విఫలమయ్యాడు. గత ఆదివారం గౌహతిలో ముగిసిన తొలి వన్డేలో 4 పరుగులకే ఔటైన ధావన్.. నిన్న విశాఖపట్నంలో ముగిసిన రెండో వన్డేలో 29 పరుగులకే పెవిలియన్ చేరిపోయాడు. ఈ నేపథ్యంలో.. చివరి మూడు వన్డేలకి అతని స్థానంలో పృథ్వీ షా అవకాశం ఇవ్వాలనే సూచనలు పెరిగాయి. కానీ.. వాటిని పట్టించుకోని సెలక్టర్లు ఈరోజు చివరి మూడు వన్డేల కోసం ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్‌గా ధావన్‌కే చోటిచ్చారు.

సెలక్టర్లు ఈరోజు ప్రకటించిన భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.