భారత్తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందే పర్యాటక వెస్టిండీస్ జట్టుకి వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే క్రమశిక్షణ తప్పిన ఆ జట్టు కోచ్పై ఐసీసీ రెండు వన్డేల సస్పెన్షన్ వేటు వేయగా.. తాజాగా ఓపెనర్ ఎవిన్ లావిస్ వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రకటించింది. క్రిస్గేల్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో తదితర హిట్లర్ల లేకపోవడంతో ఇప్పటికే బలహీనంగా కనిపిస్తున్న వెస్టిండీస్ వన్డే జట్టు.. తాజాగా ఎవిన్ లావిస్ కూడా దూరమవడంతో మరింత పేలవంగా మారింది. వన్డే సిరీస్కి ఎవిన్ లావిస్ స్థానంలో కీరన్ పోవెల్ని వన్డే జట్టులోకి వెస్టిండీస్ ఎంపిక చేసింది.
ఐపీఎల్ 2018 సీజన్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన ఎవిన్ లావిస్కి భారత్ పిచ్లపై మంచి అవగాహన ఉంది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడే నైజమున్న ఈ హిట్టర్ ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్ల లయని దెబ్బతీయడంలో సిద్ధహస్తుడు. జూలై 9, 2017న భారత్తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో కేవలం 62 బంతుల్లోనే 6x4, 12x6 సాయంతో ఏకంగా 125 పరుగులతో ఎవిన్ లావిస్ అజేయంగా నిలిచాడు. దీంతో.. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ ఛేదించేసింది. గత ఏడాదికాలంగా ఓపెనర్ క్రిస్గేల్కి జట్టులో ప్రత్యామ్నాయంగా లావిస్ కనిపించాడు.
ఈనెల 21 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు వన్డేల సిరీస్ మొదలుకానుంది.
ఐపీఎల్ 2018 సీజన్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన ఎవిన్ లావిస్కి భారత్ పిచ్లపై మంచి అవగాహన ఉంది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడే నైజమున్న ఈ హిట్టర్ ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్ల లయని దెబ్బతీయడంలో సిద్ధహస్తుడు. జూలై 9, 2017న భారత్తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో కేవలం 62 బంతుల్లోనే 6x4, 12x6 సాయంతో ఏకంగా 125 పరుగులతో ఎవిన్ లావిస్ అజేయంగా నిలిచాడు. దీంతో.. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ ఛేదించేసింది. గత ఏడాదికాలంగా ఓపెనర్ క్రిస్గేల్కి జట్టులో ప్రత్యామ్నాయంగా లావిస్ కనిపించాడు.
ఈనెల 21 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు వన్డేల సిరీస్ మొదలుకానుంది.