యాప్నగరం

IND vs WI 1st T20: వెస్టిండీస్‌తో తొలి టీ20కి భారత్ జట్టు ఇదే..?

వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటలకి జరగనున్న తొలి టీ20కి భారత తుది జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడగా.. అతని స్థానంలో వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో.. రోహిత్ శర్మకి జోడీగా సంజు శాంసన్‌ని ఓపెనర్‌గా ఆడిస్తారా..? లేదా కేఎల్ రాహుల్‌కి అవకాశమిస్తారా..? అనేదానిపై స్పష్టత రావడం లేదు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ రెగ్యులర్ ఓపెనర్ అయినప్పటికీ.. గత కొంతకాలంగా అతడ్ని టీమిండియా మేనేజ్‌మెంట్ మిడిలార్డర్‌లో ఆడిస్తోంది.

Samayam Telugu 4 Dec 2019, 4:55 pm
వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటలకి జరగనున్న తొలి టీ20కి భారత తుది జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడగా.. అతని స్థానంలో వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో.. రోహిత్ శర్మకి జోడీగా సంజు శాంసన్‌ని ఓపెనర్‌గా ఆడిస్తారా..? లేదా కేఎల్ రాహుల్‌కి అవకాశమిస్తారా..? అనేదానిపై స్పష్టత రావడం లేదు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ రెగ్యులర్ ఓపెనర్ అయినప్పటికీ.. గత కొంతకాలంగా అతడ్ని టీమిండియా మేనేజ్‌మెంట్ మిడిలార్డర్‌లో ఆడిస్తోంది.
Samayam Telugu india vs west indies indias predicted xi for 1st t20
IND vs WI 1st T20: వెస్టిండీస్‌తో తొలి టీ20కి భారత్ జట్టు ఇదే..?


రిషబ్ పంత్ రాణించేనా..?

Photo credit: AP

మిడిలార్డర్‌లో ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ తన స్థానాన్ని ఖాయం చేసుకోగా. ఒక స్థానం కోసం మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీనెలకొంది. కానీ.. సుందర్‌వైపే కెప్టెన్ కోహ్లీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబే‌కి మరో అవకాశం దక్కనుండగా.. అందరి చూపు ఇప్పుడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై పడింది. వరుసగా పంత్ విఫలమవుతున్నా సెలక్టర్లు అవకాశాలిస్తుండటంపై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.

జోరుమీదున్న దీపక్ చాహర్

Photo credit: BCCI

బౌలింగ్‌ విభాగంలో పేసర్లు దీపక్ చాహర్, భువనేశ్వర్‌లకి తోడుగా ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఉండటంతో.. మహ్మద్ షమీ రిజర్వ్ బెంచ్‌కి పరిమితమవ్వక తప్పదు. ఇక స్పిన్నర్లలో చాహల్‌, జడేజాకి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తుండగా.. కుల్దీప్ యాదవ్‌‌ని తొలి టీ20లో బెంచ్‌పై కూర్చోబెట్టాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.

తొలి టీ20కి భారత తుది జట్టు అంచనా: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.