యాప్నగరం

వెస్టిండీస్‌పై తొలి టెస్టులో కోహ్లి శతకం..!

ఓవర్‌నైట్ స్కోరు 364/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు 107 ఓవర్లు ముగిసే సమయానికి 465/4తో మెరుగైన స్థితిలో నిలిచింది.

Samayam Telugu 5 Oct 2018, 11:12 am
రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకం బాదాడు. 184 బంతుల్లో 7x4 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ.. కెరీర్‌లో 24వ సెంచరీని నమోదు చేశాడు. అతనికి తోడుగా రిషబ్ పంత్ (92: 84 బంతుల్లో 8x4, 4x6) కూడా దూకుడుగా ఆడటంతో.. ఓవర్‌నైట్ స్కోరు 364/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు 108.1 ఓవర్లు ముగిసే సమయానికి 470/5తో నిలిచింది.
Samayam Telugu 26kohli


ఈరోజు వ్యక్తిగత స్కోరు 72 వద్ద విరాట్ కోహ్లి, 17 వద్ద రిషబ్ పంత్ భారత్ ఇన్నింగ్స్‌ని ఆరంభించారు. అయితే.. కోహ్లి ఆచితూచి ఆడినా.. రిషబ్ పంత్ మాత్రం చెలరేగిపోయాడు. ఆరంభం నుంచే పేసర్లు, స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగుతూ ఎడాపెడా ఫోర్లు బాదేశాడు. దీంతో.. కోహ్లి శతకానికి సమీపించే సరికి పంత్ కూడా 80లోకి వచ్చాడు. కానీ.. కోహ్లి సెంచరీ ముగిసిన కొద్దిసేపటికే భారీ షాట్ కోసం ప్రయత్నించి వ్యక్తి స్కోరు 92 వద్ద రిషబ్ పంత్ ఔటయ్యాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన చివరి టెస్టులో పంత్ మెరుపు శతకం బాదిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.