పుణె వేదికగా వెస్టిండీస్తో ఈరోజు జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గౌహతి వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందిన టీమిండియా.. విశాఖపట్నంలో బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో ఆఖరి బంతి వరకూ పోరాడి మ్యాచ్ని డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత్ తుది జట్టులో విరాట్ కోహ్లి మూడు మార్పులు చేశాడు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ మళ్లీ జట్టులోకిరాగా.. జడేజా, ఉమేశ్, షమీపై వేటు పడింది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, చాహల్
భారత్ తుది జట్టులో విరాట్ కోహ్లి మూడు మార్పులు చేశాడు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ మళ్లీ జట్టులోకిరాగా.. జడేజా, ఉమేశ్, షమీపై వేటు పడింది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, చాహల్