యాప్నగరం

India vs WI, 2nd Test: హైదరాబాద్‌ టెస్టుకి భారత్ జట్టు ప్రకటన..!

రాజ్‌కోట్ టెస్టులో శతకం బాదిన ఓపెనర్ పృథ్వీ షా జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. డకౌటైనప్పటికీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి మరో అవకాశం దక్కింది.

Samayam Telugu 11 Oct 2018, 12:48 pm
వెస్టిండీస్‌తో హైదరాబాద్‌‌లోని ఉప్పల్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ కోసం సెలక్టర్లు ఈరోజు భారత జట్టుని ప్రకటించారు. రాజ్‌కోట్‌లో గత శనివారం ముగిసిన తొలి టెస్టులో ఆడిన 11 మందిని అలానే కొనసాగించిన సెలక్టర్లు.. 12వ ఆటగాడిగా ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌ని తాజాగా జట్టులోకి చేర్చారు. దీంతో.. కనీసం రెండో టెస్టులోనైనా అవకాశం దక్కుతుందని ఆశించిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆంధ్రా క్రికెటర్‌ హనుమ విహారి, యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌‌కి నిరాశ తప్పలేదు.
Samayam Telugu DozM2S3XoAEepHl


రాజ్‌కోట్ టెస్టులో శతకం బాదిన ఓపెనర్ పృథ్వీ షా జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. డకౌటైనప్పటికీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి మరో అవకాశం దక్కింది. అయితే.. తొలి టెస్టులో విఫలమైన ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలో ఒకరిపై వేటు పడుతుందని అంతా భావించారు. కానీ.. వారిని అలానే కొనసాగించిన సెలక్టర్లు.. శార్ధూల్ ఠాకూర్‌ని కూడా జట్టులోకి చేర్చారు. దీంతో.. రేపు తుది జట్టులో మార్పులు ఉండే అవకాశాలూ లేకపోలేదు..! తొలి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ టెస్టు కోసం ప్రకటించిన భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.