యాప్నగరం

India vs Zimbabwe వన్డే సిరీస్ షెడ్యూల్.. మ్యాచ్ టైమింగ్స్ ఇవే

IND vs ZIM ODI Series గురువారం నుంచి ప్రారంభంకాబోతోంది. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లకీ హరారే స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతుండగా.. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లు..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 17 Aug 2022, 8:45 pm

ప్రధానాంశాలు:

  • జింబాబ్వేతో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలు
  • అక్కడ మూడు వన్డేలని ఆడనున్న టీమిండియా
  • కెప్టెన్‌గా టీమ్‌ని నడిపించబోతున్న కేఎల్ రాహుల్
  • మ్యాచ్‌లన్నీ ఒకే స్టేడియంలోనే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Team India (Pic Credit: BCCI/Twitter)
భారత వన్డే జట్టు (Pic Credit: BCCI/Twitter)
భారత్, జింబాబ్వే మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకాబోతోంది. ఆగస్టు 27 నుంచి యూఏఈలో ఆసియా కప్ జరగనుండటంతో సీనియర్ క్రికెటర్లకి రెస్ట్ ఇచ్చిన భారత సెలెక్టర్లు టీమ్‌లో ఎక్కువగా యువ ఆటగాళ్లకే అవకాశమిచ్చారు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ టీమ్‌ని నడిపించబోతుండగా.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సపోర్ట్ ఇవ్వనున్నాడు.
జింబాబ్వే గడ్డపై మూడు వన్డేలకీ హరారే స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతుండగా.. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 12:45 గంటలకి ప్రారంభంకానున్నాయి. ఇక తొలి వన్డే గురువారం ( ఆగస్టు 18), రెండో వన్డే శనివారం (ఆగస్టు 20), ఆఖరి వన్డే సోమవారం (ఆగస్టు 22) జరగనున్నాయి. ఈ మూడు వన్డేల సిరీస్‌ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారంకానుంది.

జింబాబ్వే‌తో వన్డే సిరీస్‌కి భారత్ జట్టు ఇదే: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, షబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

వాస్తవానికి ఈ వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా తొలుత శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. కానీ.. సడన్‌గా కేఎల్ రాహుల్‌ని జట్టుతో చేర్చిన భారత సెలెక్టర్లు అతని చేతికే పగ్గాలు కూడా ఇచ్చారు. అలానే వాషింగ్టన్ సుందర్ తొలుత జట్టులోకి ఎంపికైనా గాయం కారణంగా దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో షబాజ్ అహ్మద్‌ని జట్టులోకి ఎంపిక చేశారు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.