అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆటలో మూడో రోజైన శనివారం 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. పేలవరీతిలో 135 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత స్పిన్నర్లు అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) చెరో 5 వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. దాంతో.. నాలుగు టెస్టుల ఈ సిరీస్ని భారత్ 3-1తో చేజిక్కించుకోగా.. ఈ మ్యాచ్లో గెలుపొందడం ద్వారా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కీ భారత్ అర్హత సాధించింది. జూన్ 18 నుంచి 22 వరకూ లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో ఆ ఫైనల్ మ్యాచ్ని టీమిండియా ఆడనుంది.
160 పరుగుల లోటుతో ఈరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. ఆ జట్టు ఓపెనర్లు జాక్ కార్లీ (5), డొమినిక్ సిబ్లీ (3)తో పాటు జానీ బెయిర్స్టో (0), బెన్స్టోక్స్ (2), ఓలీ పోప్ (15) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. భారత బౌలర్లని కాసేపు సహనంతో ఎదుర్కొన్న కెప్టెన్ జో రూట్ (30: 72 బంతుల్లో 3x4) కూడా టీమ్ స్కోరు 65 వద్ద ఔటవడంతో.. ఇంగ్లాండ్ గెలుపుపై ఆశలు వదిలేసింది. అయితే.. చివర్లో డేనియల్ లారెన్స్ (50: 95 బంతుల్లో 6x4)హాఫ్ సెంచరీతో ఆ జట్టు ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో రెండు రోజుల్లోనే ముగియగా.. ఈ నాలుగో టెస్టు మూడు రోజుల్లో ముగిసిపోవడం విశేషం.
ఈరోజు 294/7తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత్ జట్టులో.. వాషింగ్టన్ సుందర్ (96 నాటౌట్: 174 బంతుల్లో 10x4, 1x6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడగా.. అక్షర్ పటేల్ (43: 97 బంతుల్లో 5x4, 1x6) అతనికి చక్కటి సహకారం అందించాడు. శుక్రవారం యువ హిట్టర్ రిషబ్ పంత్ (101: 118 బంతుల్లో 13x4, 2x6) సెంచరీ బాదిన విషయం తెలిసిందే. గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 205 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టుకి 160 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
160 పరుగుల లోటుతో ఈరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. ఆ జట్టు ఓపెనర్లు జాక్ కార్లీ (5), డొమినిక్ సిబ్లీ (3)తో పాటు జానీ బెయిర్స్టో (0), బెన్స్టోక్స్ (2), ఓలీ పోప్ (15) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. భారత బౌలర్లని కాసేపు సహనంతో ఎదుర్కొన్న కెప్టెన్ జో రూట్ (30: 72 బంతుల్లో 3x4) కూడా టీమ్ స్కోరు 65 వద్ద ఔటవడంతో.. ఇంగ్లాండ్ గెలుపుపై ఆశలు వదిలేసింది. అయితే.. చివర్లో డేనియల్ లారెన్స్ (50: 95 బంతుల్లో 6x4)హాఫ్ సెంచరీతో ఆ జట్టు ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో రెండు రోజుల్లోనే ముగియగా.. ఈ నాలుగో టెస్టు మూడు రోజుల్లో ముగిసిపోవడం విశేషం.
ఈరోజు 294/7తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత్ జట్టులో.. వాషింగ్టన్ సుందర్ (96 నాటౌట్: 174 బంతుల్లో 10x4, 1x6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడగా.. అక్షర్ పటేల్ (43: 97 బంతుల్లో 5x4, 1x6) అతనికి చక్కటి సహకారం అందించాడు. శుక్రవారం యువ హిట్టర్ రిషబ్ పంత్ (101: 118 బంతుల్లో 13x4, 2x6) సెంచరీ బాదిన విషయం తెలిసిందే. గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 205 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టుకి 160 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.