యాప్నగరం

icc womens world t20: పాక్‌పై భారత్ ఫీల్డింగ్

గత శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు.. అదే జోరుని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.

Samayam Telugu 11 Nov 2018, 8:18 pm
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు.. అదే జోరుని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా చేతిలో తొలి మ్యాచ్‌లోనే 52 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్ టోర్నీలో బోణి కొట్టాలని ఆశిస్తోంది.
Samayam Telugu DrtTAiXV4AAhdtL


భారత్ జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు శతకంతో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉండగా.. జెమిమా రోడ్రిగ్స్ నిలకడగా ఆడుతోంది. అయితే.. బౌలర్లు మాత్రం ఇంకా లయ అందుకోలేదు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ల దూకుడు ముందు తేలిపోయిన బౌలర్లు.. కనీసం పాక్‌తో మ్యాచ్‌లోనైనా రాణిస్తారేమో..? చూడాలి. వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.