యాప్నగరం

వార్మప్ మ్యాచ్‌లో భారత్‌ని ఓడించిన ఆసీస్

భారత్ బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్ జట్టుతో మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 103 పరుగుల తేడాతో

TNN 12 Sep 2017, 5:53 pm
భారత్ బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్ జట్టుతో మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది. గుర్‌ప్రీత్‌మన్ కెప్టెన్సీలో బరిలోకి భారత్ బోర్డు జట్టు ఆస్ట్రేలియాకి ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది.
Samayam Telugu indian board presidents xi vs australia australia won by 103 runs
వార్మప్ మ్యాచ్‌లో భారత్‌ని ఓడించిన ఆసీస్


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (64: 48 బంతుల్లో 11x4), కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (55: 68 బంతుల్లో 4x4, 1x6), ట్రావిస్ హెడ్ (65: 63 బంతుల్లో 5x4, 1x6), స్టాయినిస్ (76: 60 బంతుల్లో 4x4, 5x6) అర్ధ శతకాలు బాదేశారు. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (2/23) మాత్రమే పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఛేదనలో ఓపెనర్ గోస్వామి (43), మయాంక్ అగర్వాల్ (42), అక్షయ్ (40), కుశాంగ్ పటేల్ (41 నాటౌట్) ఫర్వాలేదనిపించినా.. ఒక్కరు కూడా అర్థశతకం పూర్తి చేయలేకపోయారు. దీంతో చివరికి భారత్ బోర్డు జట్టు 48.2 ఓవర్లలోనే 244 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ అగర్ (4/44) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.