యాప్నగరం

ప్రాక్టీస్ వన్డేలో న్యూజిలాండ్ ఓటమి

భారత్‌లో పర్యటనని ఓటమితో న్యూజిలాండ్ ఆరంభించింది. భారత్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో మంగళవారం

TNN 17 Oct 2017, 7:20 pm
భారత్‌లో పర్యటనని ఓటమితో న్యూజిలాండ్ ఆరంభించింది. భారత్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో మంగళవారం జరిగిన తొలి ప్రాక్టీస్ వన్డేలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఓపెనర్లు పృథ్వీ షా (66: 80 బంతుల్లో 9x4, 1x6), కేఎల్ రాహుల్ (68: 75 బంతుల్లో 9x4, 1x6)తో పాటు కరుణ్ నాయర్ (78: 64 బంతుల్లో 12x4) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రెసిడెంట్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన కివీస్.. భారత బౌలర్లు నదీమ్ (3/41), జయదేవ్ ఉనద్కత్ (3/62) ధాటికి 47.4 ఓవర్లలోనే 265 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో టామ్ లోథమ్ (59: 63 బంతుల్లో 7x4), కెప్టెన్ విలియమ్సన్ (47: 49 బంతుల్లో 7x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
Samayam Telugu indian board presidents xi won by 30 runs
ప్రాక్టీస్ వన్డేలో న్యూజిలాండ్ ఓటమి


ఛేదన ఆరంభంలోనే కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (22: 20 బంతుల్లో 2x4, 2x6) హిట్టింగ్‌తో బౌలర్ల లయ దెబ్బతీసేందుకు ప్రయత్నించగా.. ధవళ్ కులకర్ణి అతడ్ని ఔట్ చేసి జట్టుకి శుభారంభమిచ్చాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ మరో ఓపెనర్ మున్రో (26)తో కలిసి స్కోరు బోర్డుని నడిపించాడు. అయితే.. స్పిన్నర్ కర్ణ్‌శర్మ కెప్టెన్‌ని బుట్టలో వేయగా.. మున్రోని నదీమ్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన రాస్ టేలర్ (34: 52 బంతుల్లో 1x4) మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో కివీస్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో చివర్లో శాంట్నర్ (26), గ్రాండ్ హోమ్ (33) పోరాడిన ఫలితం లేకపోయింది. రెండో ప్రాక్టీస్ వన్డే గురువారం జరగనుంది. భారత్ ప్రధాన జట్టుతో ఆదివారం వాంఖడే వేదికగా తొలి వన్డేలో న్యూజిలాండ్ ఢీకొననుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.