యాప్నగరం

కివీస్ టూర్‌పై విరాట్ కోహ్లీ అసంతృప్తి

తక్కువ వ్యవధిలో మ్యాచ్‌‌లాడటంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి షెడ్యూలింగ్ సరిగ్గా లేదని వ్యాఖ్యానించాడు.

Samayam Telugu 24 Jan 2020, 9:58 pm
మ్యాచ్‌ల నిర్వహణపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. వెంటవెంటనే మ్యాచ్‌లు ఆడాల్సి రావడంపై బోర్డు వైఖరిని ప్రశ్నించాడు. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆదివారం ముగియడంతో న్యూజిలాండ్‌కు వెంటనే భారత్ వచ్చింది. ఈక్రమంలో శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ ఆడింది. అయితే తగినంత సమయం ఇవ్వకపోవడంతోపాటు వెంటనే మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల తమకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
Samayam Telugu indian captain virat kohli feels unhappy with scheduling in newzealand tour
కివీస్ టూర్‌పై విరాట్ కోహ్లీ అసంతృప్తి


Read Also : పంత్ రీ ఎంట్రీపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే న్యూజిలాండ్ సమయం భారత్‌కంటే ఏడున్నర గంటలు ముందుంటుంది. ఈక్రమంలో కాస్త త్వరగానే భారత్ ఈ మ్యాచ్‌కు సిద్ధమవ్వాల్సి వచ్చింది. అయితే తాము ఈ మ్యాచ్‌ కోసం ముందే సిద్ధమయ్యామని, జెట్ లాగ్ (ప్రయాణ బడలిక)లాంటి కారణాలు వెతుక్కోలేదని తెలిపాడు. మరోవైపు ఆక్లాండ్ వన్డేలో భారత్‌కు మద్దతు పలికిన స్థానిక ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పాడు. 200+ రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో అభిమానుల మద్దతు ఎంతో అవసరమని గుర్తుచేశాడు.

Read Also : ఆండ్రీ రస్సెల్‌కు పుత్రికోదయం.. పేరేమిటంటే..?

ఇక ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్కు మైదానంలో ఎంతటి టార్గెట్ అయిన నిలుపుకోవడం కష్టమని కోహ్లీ వ్యాఖ్యానించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని 210 పరుగుల లోపే నియంత్రిచడం సానుకూలాంశమని పేర్కొన్నాడు. మరోవైపు గతవారం ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో విజయం సాధించడంతో తమ జట్టు ఆత్మవిశ్వాసం పెరిగిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌పై ఆరు వికెట్లతో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే.

Read Also : 200+ రన్స్ ఛేదనలో టీమిండియా.. ‘సరిలేరు నీకెవ్వరూ’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.