యాప్నగరం

కరోనాపై అందరూ అలెర్ట్‌గా ఉండండి: కోహ్లీ

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌మంతా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వ్యాధి కార‌ణంగా ఎనిమిదివేల మందికిపైగా మ‌ర‌ణించ‌గా.. రెండు ల‌క్ష‌లు మందికిపైగా ఈ వ్యాధి ప్ర‌భావానికి గుర‌య్యారు.

Samayam Telugu 19 Mar 2020, 11:19 pm
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ గురించి గురువారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాధిని అరిక‌ట్టేందుకు ఆదివారం ఒక‌రోజు ప్ర‌జ‌లంతా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉండాల‌ని, జ‌న‌తా క‌ర్ఫ్యూను పాటించాలని సూచించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌ధాని మోదీ సూచించిన నివారణ చ‌ర్య‌ల‌కు భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌ద్ధ‌తుగా నిలిచాడు. క‌రోనా వైర‌స్‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించాడు. బాధ్యాత‌యుత‌మైన పౌరులుగా మ‌నమంద‌రం ఉండాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ట్వీట్ చేశాడు.
Samayam Telugu Lucknow: Indian cricket team captain Virat Kohli arrives at an airport wearing a...
Indian cricket team captain Virat Kohli


Read Also: ఒలింపిక్స్‌పై ఐఓసీవి మతిలేని మాటలు:క‌శ్య‌ప్‌



మ‌రోవైపు ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వైర‌స్ కార‌ణంగా 2 ల‌క్ష‌ల‌మంది క‌రోనా పాజిటివ్‌గా తేలారు. ఎనిమిది వేల‌మందికిపైగా మ‌ర‌ణించారు. మ‌రోవైపు క‌రోనా గురించి మోదీ జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. క‌రోనాపై దాదాపుగా యుద్ధాన్ని ప్రక‌టించారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి జ‌న‌తా క‌ర్బ్యూను పాటించ‌డం ద్వారా మ‌నల్ని మ‌నం కాపాడుకోవ‌డంతోపాటు దేశాన్ని, ప్ర‌పంచాన్నికాపాడుకోవ‌చ్చ‌ని ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

Read Also: ఆ క్రికెటర్‌తో క్వారంటైన్‌లో ఉంటే భలే స‌ర‌దా!

ఇక క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అన్ని రంగాల‌పైన ప‌డింది.ఇప్ప‌టికే భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా వ‌న్డే సిరీస్‌ను ర‌ద్దు చేసిన బీసీసీఐ.. ఐపీఎల్‌ను ఈనెల 29 నుంచి వ‌చ్చేనెల 15 వ‌ర‌కు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్ ప్ర‌పంచ‌క‌ప్‌తోపాటు అనేక టోర్నీల‌ను వాయిదా వేశారు. మ‌న‌దేశంలోనూ క‌రోనా వైర‌స్ మెల్లిగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే 160 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మ‌రోవైపు న‌లుగురు ఈ వ్యాధి కార‌ణంగా చ‌నిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.