యాప్నగరం

గంభీర్ ట్వీట్‌కు స‌మాధాన‌మిచ్చిన రోహిత్‌ శర్మ

భార‌త విధ్వంస‌క ఓపెన‌ర్లలో రోహిత్ శ‌ర్మ అగ్ర‌గ‌ణ్యుడు. గ‌తేడాది టెస్టుల్లోనూ త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకున్న హిట్‌మ్యాన్‌.. మూడు ఫార్మాట్ల‌లోనూ స‌త్తాచాటుతున్నాడు.

Samayam Telugu 1 May 2020, 10:50 pm
భార‌త వైట్‌బాల్ క్రికెట్ వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పుట్టిన‌రోజు గురువారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్బంగా మాజీ క్రికెట‌ర్ క‌మ్ ఎంపీ గౌతం గంభీర్ శుభాకాంక్ష‌లు చెబుతూ ఒక ట్వీట్ చేశాడు. అందులో ప్ర‌పంచంలోకెల్లా అత్యుత్తమ వైట్‌బాల్ క్రికెట‌ర్ రోహిత్ అని ప్ర‌శంస‌లు కురిపించాడు. రాబోయే ఏడాది మరింత మంచి జ‌ర‌గాల‌ని ఆకాంక్షించాడు. తాజాగా దీనిపై రోహిత్ స్పందించాడు. ప్ర‌పంచంలోకెల్లా అత్యుత్త‌మ వైట్‌బాల్ క్రికెట‌ర్ గురించి తనకు తెలియ‌ద‌ని, అయితే గౌతీ పనిత‌నం మాత్రం బాగుంద‌ని కితాబిచ్చాడు.
Samayam Telugu Rohit Sharma
India's Rohit Sharma plays a shot during the third and final ODI cricket match against Australia, at Chinnaswamy Stadium in Bengaluru.Photo/Shailendra Bhojak) (


Must Read: భార్య అనుష్క ‌శ‌ర్మ‌ పుట్టిన‌రోజుపై కోహ్లీ ఎమోష‌నల్ మెసేజ్‌
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక గంభీర్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన గౌతీ.. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తూర్పు ఢిల్లీ నుంచి ఎన్నిక‌య్యాడు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంతా అత‌లాకుత‌ల‌మ‌వుతున్న వేళ త‌ను స్పందించాడు.



Must Read: క్రికెట్ కోసం.. ఉద‌య‌మే రెండింటికి లేచి.. ఆరు గంట‌ల ప్ర‌యాణంతో స్టేడియానికి: రిష‌భ్ పంత్‌

ఇప్ప‌టికే రూ. కోటి విరాళాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి గంభీర్ ప్ర‌కటించాడు. అలాగే రాబోయే రెండు సంవత్స‌రాల‌కు సంబంధించి ఎంపీ జీతాన్ని ప్ర‌ధాన‌మంత్రి కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపాడు. అలాగే తన ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌ను గంభీర్ ఆదుకుంటూ వ‌స్తున్నాడు. ఈ నేప‌థ్యంలో గౌతీ చేస్తున్న ప‌నుల‌పై ముగ్ధుడై రోహిత్ అలా స్పందించిన‌ట్లు తెలుస్తోందని నెటిజ‌న్లు భావిస్తున్నారు. ‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.