యాప్నగరం

ఆ డాల్ఫిన్లను చూస్తే ముచ్చ‌టేస్తోంది: రోహిత్ శ‌ర్మ‌

కరోనా వైరస్ కారణంగా బ్రేక్ దొరకడంతో భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఇంటి పట్టునే ఉంటున్నాడు. తాజాగా తను సోషల్ మీడియాలో నేచర్ గురించి షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ అయింది.

Samayam Telugu 24 Mar 2020, 11:39 pm
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి ప‌ట్టునే ఉండటంతో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా తన సొంతగడ్డ ముంబైలో వుంటున్న భారత వైట్‌బాల్‌ క్రికెట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. జనాల సందడి తగ్గడంతో ముంబై తీరంలో డాల్ఫిన్లు సందడి చేస్తున్నాయనే విషయాన్ని పేర్కొంటూ పోస్ట్ చేశాడు. రోహిత్ ఇలా పోస్ట్‌ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.
Samayam Telugu Bhubaneswar: India batsman Rohit Sharma arrives at a city hotel, ahead of third ...
Rohit Sharma


Read Also: టీ20ల్లో ఇండియన్ ప్లేయర్ల ఈ రికార్డులు ఎప్పటికీ పదిలమేనా..?



ముంబై తీరంలో డాల్ఫిన్లు ఈదుతున్నాయని, ఈ దృశ్యాన్ని చూడటానికి చాలా ఆనందంగా ఉందని రోహిత్‌ పేర్కొన్నాడు. ప్రజలంతా సంయమనంతో వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అలాగే ప్రకృతి సమతుల్యం ఏర్పడడానికి కూడా, తాజా ప‌రిస్థితులతో ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. భారత్-ద‌క్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మూడు వన్డేల‌ సిరీస్ ర‌ద్దు అయిన‌ సంగతి తెలిసిందే. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజ‌న్ ఈనెల 29 నుంచి వచ్చే నెల 15కు వాయిదా పడింది.

Read Also: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైన‌ల్‌ వాయిదా!

భారత్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఐపీఎల్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. బీసీసీఐ దీనిపై వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ నడిపిస్తున్నాడు. హిట్‌మ్యాన్‌ సారథ్యంలోనే రికార్డు స్థాయిలో ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ టైటిల్‌ను నాలుగుసార్లు గెలుపొందింది. గ‌తేడాది గెలిచిన ముంబై.. 2020 ఎడిషన్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.