క‌రోనా ఫైట్‌: కొవ్వత్తులు, దీపాలతో టాప్ ప్లేయర్ల సంఘీభావం

Samayam Telugu 6 Apr 2020, 4:26 pm

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 12 ల‌క్ష‌ల‌కుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సుమారు 65వేల‌మందికిపైగా ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. మ‌న‌దేశంలో ఈ వైర‌స్ విస్త‌రిస్తోంది. వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ భార‌త ప్ర‌భుత్వం ప్ర‌కటించించింది. మ‌రోవైపు అంత‌కుముందు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గ‌త‌నెలలో మీడియా ముందుకొచ్చి క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేసే వారికి సంఘీభావం ప్ర‌క‌టించాల‌ని కోరారు. తాజాగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తొమ్మిది నిమిషాల‌పాటు లైట్ల‌ను ఆపివేసి, కొవ్వ‌త్తులు, దీపాలు లేదా ఇత‌ర సాధ‌నాల‌తో వెలుగు పంచాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని తాజా పిలుపున‌కు దేశవ్యాప్తంగా మంచి స్పంద‌న ల‌భించింది. సామాన్యుల‌తో సెల‌బ్రిటీలు పెద్ద‌యెత్తున దీపాల‌ు, కొవ్వత్తులను వెలిగించి త‌మ సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు. దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌హా ఎంతోమంది క్రికెట‌ర్లు దీపాలు, కొవ్వత్తులను వెలిగించారు. ఆయా ఫొటోల‌ను త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో పంచుకున్నారు.

  • ​స‌చిన్ కుటుంబం సంఘీభావం

    ప్ర‌ధాని పిలుపునందుకుని త‌న కుటుంబంతోస‌హా కొవ్వత్తులను వెలిగించిన స‌చిన్ టెండూల్క‌ర్‌.. సోష‌ల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశాడు. మ‌న ప‌రిస‌రాల‌ను శుభ్రం చేస్తూ, ఆస్ప‌త్రుల‌ను, వైర‌స్ ప్ర‌భావిత ప్రాంతాల‌ను శుభ్ర‌ప‌రుస్తున్న శానిటేష‌న్ సిబ్బందికి స‌చిన్ త‌ను, త‌న కుటుంబంతో క‌లిసి కృతజ్ఞ‌త‌లు తెలిపాడు. వారిని శానిటేష‌న్ వారియ‌ర్స్‌గా కొనియాడాడు. వీళ్ల కృషితోనే వైర‌స్ వ్యాప్తి చెంద‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రోవైపు మ‌న కుటుంబంలోని వైర‌స్‌కు త్రెట్ అయిన‌ పెద్ద‌ల‌ను సంర‌క్షించాల‌ని సూచించాడు. వారిని శ‌రీరక‌, మాన‌సికంగా ఆరోగ్యంగా ఉండేలా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని సూచించాడు.

  • Twitter-Sachin Tendulkar

  • ​ప్ర‌తి ఒక్క‌రి కోసం ప్రార్థించండి..

    మ‌రోవైపు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, త‌న భాగ‌స్వామి సినీ న‌టి అనుష్క శ‌ర్మతో క‌లిసి దీపాల‌ను వెలిగిస్తున్న ఫొటోల‌ను షేర్ చేశాడు. ఈ సంద‌ర్భంగా త‌ను సోష‌ల్ మీడియాలో ఒక కామెంట్‌ను పోస్టు చేశాడు. మన‌మంతా క‌లిసి ఉమ్మ‌డిగా ప్రార్థన చేస్తే క‌చ్చితమైన విభిన్న‌మైన ఫ‌లితాలు వస్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. అలాగే ప్ర‌తి ఒక్క‌రి కోసం ప్రార్థ‌న చేయాల‌ని, అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఉండాల‌ని ఒక ఎమోజీని పోస్టు చేశాడు. అలాగే భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌, హ‌ర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌, సురేశ్ రైనా త‌దిత‌రులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దీపాలు పెట్టిన ఫొటోల‌ను షేర్ చేశారు.

  • Twitter-Virat Kohli

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • Twitter-Joshna Chinappa

  • Twitter-Yogeshwar Dutt

  • Twitter-Pooja Dhanda

  • Twitter-Mahesh Bhupathi

  • Twitter-Ashwini Ponnappa

  • Twitter-parthiv patel

  • Twitter-Manika Batra

  • Twitter-Saina Nehwal

  • Twitter-Sakshi Malik

  • Twitter-Amit Panghal

  • Twitter-Bajrang Punia 🇮🇳

  • Twitter-Balbir Singh Sr.

  • Twitter-Mary Kom

  • Twitter-Harbhajan Turbanator

  • Twitter-Dutee Chand

  • Twitter-Suresh Raina🇮🇳

  • Twitter-K L Rahul

  • Twitter-hardik pandya

  • Twitter-lets stay indoors India 🇮🇳

  • Twitter-Virender Sehwag

  • Twitter-Sankar