యాప్నగరం

ఢిల్లీ అల్ల‌ర్ల‌ను ఖండించిన భారత క్రికెటర్లు

సీఏఏ అనుకూల వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ఢిల్లీలో అల‌ర్లు చెల‌రేగుతున్నాయి. తాజాగా ఈ అల్ల‌ర్ల‌ను ఉద్దేశించి భార‌త మాజీ క్రికెట‌ర్లు యువీ, సెహ్వాగ్‌, ట‌ర్బోనేట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ స్పందించారు.

Samayam Telugu 27 Feb 2020, 12:04 am
పౌర‌స‌త్వ అనుకూల చ‌ట్టం (సీఏఏ) అనుకూల, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ఢిల్లీలో అల్ల‌ర్లు చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన హింస కాండ‌లో దాదాపు 24 మంది చ‌నిపోగా.. 150 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ అల్ల‌ర్ల‌ను భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, యువ‌రాజ్ సింగ్‌, సీనియ‌ర్ ఆఫ్ స్పిన్న‌ర్‌ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఖండించారు. సోష‌ల్ మీడియా వేదిక‌పై ఈ అల్ల‌ర్ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సంయమనం పాటించాలని విజ్ఞ‌ప్తి చేశారు.
Samayam Telugu **YEARENDER 2019: SPORTS** Mumbai: Cricketer Yuvraj Singh gets emotional during ...
Cricketer Yuvraj Singh


Read Also: Team India Trolls: ప‌్రాక్టీస్‌కు వెళుతున్నారా? లేక షాపింగ్‌కా.. కోహ్లీసేనపై సెటైర్లు


తొలుత ట్విట్ట‌ర్ వేదిక‌గా యువ‌రాజ్ అల్ల‌ర్లపై ట్వీట్ చేస్తూ.. ఢిల్లీ అల్ల‌ర్లు విషాద‌క‌ర‌మైన‌వ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ శాంతి, సామ‌రస్యాల‌తో ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. త్వ‌ర‌లోనే అధికార‌యంత్రాంగం ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ఒక‌రిపైన ఒకరికి ప్రేమ‌, గౌర‌వం చూపించాల్సిన అవ‌స‌రమిద‌ని ట్వీట్ చేశాడు. డిల్లీ బ‌ర్నింగ్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను జ‌త‌చేశాడు.


Read Also: ICC Rankings కోహ్లికి షాక్‌.. బుమ్రాకు కూడా

మ‌రో ట్వీట్‌లో అంద‌రూ శాంతియుతంగా ఉండాల‌ని ఢిల్లీ వాసుల‌ను సెహ్వాగ్ కోరాడు. ఢిల్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు దురదృష్ట‌క‌ర‌మైన‌వ‌ని, ఈ అల్ల‌ర్ల కార‌ణంగా ఎవ‌రికైనా హాని జ‌రిగితే అది దేశ‌రాజ‌ధానికి మాయ‌ని మచ్చ అవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మ‌రోవైపు మ‌న‌లో మ‌నం త‌గ‌వు ప‌డ‌టం త‌గ‌ద‌ని, అంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని ట‌ర్బోనేట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ట్వీట్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.