యాప్నగరం

స్టేజ్‌ ఎక్కడానికి సిగ్గు ప‌డిన ధోనీ.. ఆ మెలిక‌తో సై (వీడియో)

క్రికెట్ నుంచి విరామం తీసుకున్న భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఇటీవల ఓ ప్రైవేట్ షోకు హాజరయ్యాడు. అక్కడ ధోనీ ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

Samayam Telugu 28 Jan 2020, 4:57 pm
భార‌త, ప్ర‌పంచ క్రికెట్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి విశిష్ట స్థానం ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మూడు ర‌కాల ఐసీసీ టోర్నీల‌ను అందించిన ఏకైక భార‌త కెప్టెన్‌గా త‌న రికార్డు ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదు. 2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌తోపాటు ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని ధోనీ సార‌థ్యంలోనే భార‌త్ నెగ్గింది. ఎల్ల‌ప్పుడూ డౌన్ టూ ఎర్త్‌గా ఉండే ధోనీ అంటే అభిమానుల‌కు చెప్ప‌లేనంత ఇష్టం. ఇక వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌లో భార‌త్ ఓడిపోయాక అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ ప‌లు ప్రైవేటు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ బీజీగా గడుపుతున్నాడు. తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ధోనీ.. వేదిక ఎక్క‌డానికి సిగ్గుల మొగ్గ‌య్యాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌లైంది.
Samayam Telugu Mumbai: Indian cricketer Mahendra Singh Dhoni at the launch of Panerai watches i...
Mahendra Singh Dhoni



Read Also : రోజ‌ర్ ఫెద‌ర‌ర్ గ్రేట్ ఎస్కేప్‌.. 8 మ్యాచ్ పాయింట్లు కాచుకుని
బాలీవుడ్ సింగ‌ర్ అర్మాన్ మాలిక్ హాజ‌రైన ఓ షోలో ధోనీ త‌న భార్య సాక్షితో క‌లిసి పాల్గొన్నాడు. త‌న జీవిత క‌థ ఆధారంగా నిర్మించిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోని ఓ పాట‌ను మాలిక్ పాడాడు. పాడుతూనే ధోనీని స్టేజ్ పైకి రావాల‌ని సూచించాడు. అయితే రెండగుడులు వేసిన ధోనీ.. సిగ్గు ప‌డుతూ స్టేజ్ పైకి ఎక్క‌లేనంటూ మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గాడు. ఈక్ర‌మంలోపాట‌లు పాడించ‌నంటూ మాలిక్ ప్రామిస్ చేయ‌డంతో ధోనీ.. సాక్షితో క‌లిసి స్టేజ్‌పైకి ఎక్కాడు. మాలిక్ పాడిన పాట‌ను ఆస్వాదిస్తూ చ‌ప్ప‌ట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సోష‌ల్ మీడియాలో తాజాగా ఈ వీడియోను పోస్టు చేయ‌గా.. క్ష‌ణాల్లో వైర‌లైంది. అభిమానులు లైకులు, కామెంట్ల‌తో త‌మ అనందాన్ని చాటుతున్నారు.

Read Also : IND vs NZ 3rd T20కి భారత్ జట్టులో ఒక మార్పు..! లయ తప్పిన అతనిపై వేటు..?
మ‌రోవైపు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిశాక ధోనీ మ‌ళ్లీ ఎప్పుడు మైదానంలోకి అడుగుపెడ‌తాడా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. అయితే రాబోయే ఐపీఎల్ సీజ‌న్‌లో స‌త్తా చాటితే.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు హాజ‌ర‌య్యే భార‌త‌జ‌ట్టులో ధోనీ స్థానం దక్కించుకుంటాడ‌ని ఇటీవ‌ల ప్ర‌ధాన కోచ్ ర‌వి శాస్త్రి చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో రాబోయే ఐపీఎల్‌లో ధోనీ స‌త్తాచాటి భార‌త్ త‌ర‌పున ఆడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also : కుక్కలపై జూదం.. అందుకే నాపేరు ‘పంటర్’.. ఈ పేరు ఎవరు పెట్టారంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.