యాప్నగరం

World Cup రనౌట్‌పై స్పందించిన ఎంఎస్ ధోనీ

గతేడాది జూలైలో వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ సెమీఫైనల్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో కప్పు నెగ్గాలని భావించిన ఇండియాకు.. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ రనౌట్‌కు గురవ్వడంతో ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది. దీంతో భారంగా ఇంటిముఖం పట్టింది. తాజాగా నాటి రనౌట్‌పై ధోనీ స్పందించాడు. కెరీర్ తొలి మ్యాచ్ రనౌటైన తాను మళ్లీ సెమీస్‌లోనే ఆ విధంగానే ఔట్ అయ్యానని గుర్తు చేసుకున్నాడు.

Samayam Telugu 12 Jan 2020, 3:30 pm
గతేడాది జూలైలో వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ సెమీఫైనల్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో కప్పు నెగ్గాలని భావించిన ఇండియాకు.. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ రనౌట్‌కు గురవ్వడంతో ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది. దీంతో భారంగా ఇంటిముఖం పట్టింది. తాజాగా నాటి రనౌట్‌పై ధోనీ స్పందించాడు. కెరీర్ తొలి మ్యాచ్ రనౌటైన తాను మళ్లీ సెమీస్‌లోనే ఆ విధంగానే ఔట్ అయ్యానని గుర్తు చేసుకున్నాడు.
Samayam Telugu indian former captain ms dhoni says about his runout in odi world cup
World Cup రనౌట్‌పై స్పందించిన ఎంఎస్ ధోనీ



పశ్చత్తాప పడుతున్న ధోనీ..

నిజానికి లీగ్ దశలో అద్భుతంగా ఆడిన భారత్ నాకౌట్‌లో మాత్రం తేలిపోయింది. కివీస్‌తో జరిగిన సెమీస్‌లో 241 పరుగులు టార్గెట్‌ను ఛేదించడానికి ఆపసోపాలు పడింది. టాపార్డర్ దారుణంగా విఫలమైన తర్వాత జడేజా (77)తో కలిసి ధోనీ (50) ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో రనౌటవడంపై ధోనీ పశ్చత్తాప పడుతున్నాడు.

డైవ్ చేసుంటే బాగుండేది..

తాజాగా రనౌట్‌పై స్పందించిన ధోనీ.. ఆ క్షణంలో తానెందుకు డౌవ్ చేయలేదని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నట్లు తెలిపాడు. రెండు అంగుళాల తేడాతో తన రనౌటయిందని, డైవ్ చేసుంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నానని పేర్కొన్నాడు.

రెండో పరుగు కోసం యత్నించి..

(getty images)

జడేజా-ధోనీ 116 భాగస్వామ్యంతో భారత్ గెలిచేలాగే కన్పించింది. ఆఖరి రెండు ఓవర్లలో విజయానికి 31 రన్స్ అవసరమయ్యాయి. లోకీ ఫెర్గూసన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి సిక్సర్ కొట్టి అర్ధశతకాన్ని ధోనీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతి డాట్ బాల్ అయింది. మరుసటి బంతికి లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి ధోనీ.. మార్టిన్ గప్టిల్ అద్భుతమైన త్రోకు రనౌటయ్యాడు.

18 పరుగులతో ఓటమి..

(getty images)
ధోనీ రనౌటయ్యాక భారత్ ఆశలు అడుగంటాయి. వెంటవెంటనే యజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ ఐదు పరుగులలోపే ఔటయ్యారు. కాసేపటికే భారత్ 221 రన్స్‌కు ఆలౌటయ్యి 18 పరుగులతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన కివీస్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలవడం విశేషం.

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా..

(getty images)

జూలై 10న సెమీస్ మ్యాచ్ ముగిశాకా దాదాపు ఆరునెలలుగా ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మెగాటోర్నీ అయ్యాక కొంతకాలంపాటు సైన్యంలో సేవలందించాడు. అనంతరం వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంకలతో భారత్ ఆడిన సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు.

ఆసీస్‌ సిరీస్‌కూ దూరం..

ఇక మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కూ ధోనీ దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఆసీస్ మూడు వన్డేలను ఆడనుంది. అనంతరం న్యూజిలాండ్ టూర్ కోసం బయల్దేరి వెళ్లనుంది.

త్వరలోనే వన్డేలకూ దూరం..

తాజాగా భారత చీఫ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ.. ధోనీ త్వరలోనే వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడని, టీ20ల్ల కొనసాగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్, ఫామ్ బాగుంటే టీ20 ప్రపంచకప్‌కు ధోనీ ఎంపికయ్యే అవకాశాలున్నాయిని తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.