యాప్నగరం

‘కరోనా’కు ఈగో ఎక్కువ: వీరేంద్ర సెహ్వాగ్

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరించిన వేళ‌ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రజలకు కొన్ని సూచనలు చేశాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ ఇళ్లల్లోనే గడపాలని సూచించాడు.

Samayam Telugu 26 Mar 2020, 6:01 pm
కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరవై రోజుల పాటు అందరూ ఇళ్లలోనే గడపాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ఆదేశించిన సంగతి విదితమే. అయితే కరణ వైరస్‌పై తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఇన్‌స్టాగ్రామ్‌లో తనదైన శైలిలో స్పందించాడు. కరోనా వైరస్‌కు ఈగో ఎక్కువ అని, తనంతట తాను ఇంటిలోకి ప్రవేశించబోద‌ని ఈ సందర్భంగా చమత్కరించాడు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితిలో మినహా మిగతా సమయమంతా ఇంటిలోనే ఉండాలని సూచించాడు. తద్వారా వైరస్ ఆహ్వానించే అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నాడు.
Samayam Telugu Mumbai: Former Indian batsman Virender Sehwag during a practice session ahead of...
Virender Sehwag


Read Also:‘క‌రోనా’ ఉధృతికి కారణం మన అలవాట్లే: అక్త‌ర్‌

కరోనా వైరస్ కారణంగా చరిత్రలో తొలిసారి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచే ప‌ని) చేస్తున్నారని సెహ్వాగ్‌ సూచించాడు. ఎవరి జీతాలు వాళ్లకు వస్తాయని, 20 రోజులపాటు ఇంట్లో గడపాలని సూచించాడు. 15 నుంచి 20 రోజుల‌ పాటు ఓపిక పడితే, వైరస్‌ను దేశం నుంచి తరిమి కొట్టే అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చే ఆలోచ‌న‌లు చేయకూడదని హితవు పలికాడు.

Read Also: ఎంఎస్ ధోనీ మెరుపు రనౌట్‌కు నాలుగేళ్లు

క‌రోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈనెల 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. దాన్ని వచ్చే నెల 15 వరకు వాయిదా వేశారు. అలాగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలను కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో పలు క్రికెట్ స్టేడియాలను క్వారంటైన్ సదుపాయాల కోసం వాడుకోవచ్చని, వివిధ క్రికెట్ సంఘాలు ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.