యాప్నగరం

క్రికెటర్ల జీతాల గురించి నీకెందుకు: గావ‌స్క‌ర్‌ ఫైర్

క‌రోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్ల జీతాల్లో కోత విధించే అవకాశం ఉందని గతంలో ఐసీఏ అధ్యక్షుడు అశోక్ మ‌ల్హోత్రా వ్యాఖ్యానించిన‌ సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై గావ‌స్క‌ర్‌ స్పందించాడు.

Samayam Telugu 5 Apr 2020, 8:51 pm
క‌రోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోయిన‌ సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా క్రికెట్ కార్యకలాపాలు వాయిదా పడడంతో క్రికెట‌ర్లు ఇళ్ల‌కే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో క్రికెటర్ల జీతాల్లో కోత విధించే అవకాశం ఉందని, ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ (ఐసీఏ) అధ్య‌క్షుడు అశోక్ మ‌ల్హోత్రా వ్యాఖ్యానించాడు. గతంతో పోలిస్తే బోర్డు సంపాదన ఇప్పుడు త‌గ్గింద‌ని, వాళ్ళ జీతాల్లో కోతను ఊహించ‌వ‌చ్చ‌ని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెటర్ల జీతాలు, కోత‌ల‌ గురించి మాట్లాడటానికి మ‌ల్హోత్రా ఎవరని ప్రశ్నించాడు.
Samayam Telugu Kolkata: Cricket legend Sunil Gavaskar during a felicitation ceremony for his co...
Cricket legend Sunil Gavaskar


Read Also: రోహిత్ శ‌ర్మ‌: ఈ రికార్డులతో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

నిజానికి ఐసీఏలో ప్రస్తుతం భారత్‌కు ఆడుతున్న క్రికెటర్లు కానీ, ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు గాని ఎవరు ప్రాతినిధ్యం వహించడం లేదు. రిటైరైన భార‌త క్రికెట‌ర్లే ఇందులో ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. తాజాగా గావ‌స్క‌ర్.. మ‌ల్హోత్రా వ్యాఖ్య‌ల‌పై మాట్లాడుతూ.. క్రికెట‌ర్ల జీతాలు గురించి మాట్లాడేందుకు, ఐసీఏకు ఎలాంటి అధికారాలు లేవని, ఆయనకు ఎలాంటి హ‌క్కులు లేవ‌ని పేర్కొన్నాడు. తనకు సంబంధం లేని అంశాల గురించి మాట్లాడ‌టం స‌రికాద‌ని, ఈ సంఘాల్లో యాక్టివ్‌ క్రికెటర్లు ఎవ‌రూ కూడా పాలు పంచుకోలేదని గుర్తు చేశాడు.

Read Also: ధోనీతో గొడవపై స్పందించిన భారత క్రికెట‌ర్‌

మరోవైపు గత నెలలో దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ర‌ద్దు చేసుకంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన రెండు మ్యాచ్‌ల‌ను వైరస్ కారణంగా బీసీసీఐ ర‌ద్దు చేసింది. అలాగే వైరస్ వ్యాప్తి నేప‌థ్యంలో ఐపీఎల్‌ను గత నెల 29 నుంచి ఈ నెల 15 వరకు బోర్డు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నడుస్తున్న క్రమంలో, ఈ నెల 14 వరకు అమల్లో ఉండ‌టంతో ఐపీఎల్ అనుకున్న సమయానికి ప్రారంభమయ్యే అవకాశాలు లేన‌ట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.