యాప్నగరం

బీసీసీఐ అధికారిపై మండిపడిన సునీల్ గవాస్కర్

కరోనా వైరస్ కారణంగా ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ లో వచ్చే నెల 15 కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఈ ఏడాది ఐపిఎల్ నిర్వహించడం అనుమానంగా మారింది.

Samayam Telugu 20 Mar 2020, 5:33 pm
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌ను అవమానించేలా మాట్లాడిన బీసీసీఐ అధికారిపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఇది భారత క్రికెట్ కు అవమానం లాంటిదేనని అభిప్రాయపడ్డాడు. నిజానికి కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌ను వ‌చ్చే నెల 15 కు వాయిదా పడింది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది ఐపిఎల్ నిర్వ‌హించ‌డం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు లేకపోతే ఐపీఎల్ అనేది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ తరహాలో అనాకర్షణీయంగా ఉంటుందని బోర్డు అధికారి పేర్కొన్నాడు. దీనిపై తాజాగా సునీల్ గవాస్కర్ స్పందించాడు.
Samayam Telugu Kolkata: Cricket legend Sunil Gavaskar during a felicitation ceremony for his co...
Cricket legend Sunil Gavaskar


Read Also: భారత ఫుట్‌బాల్ దిగ్గ‌జం పీకే బెన‌ర్జీ క‌న్నుమూత‌

సయ్యద్ ముస్తాక్ అలీ అనే గొప్ప క్రికెటర్ పేరు మీదున్న ఈ టోర్నీని నిర్వహిస్తున్నారని సన్నీ గుర్తుచేశాడు. అలాంటి ఈ టోర్నీ ఇలా అనాస‌క్తిగా ఉండటం సరికాదని వ్యాఖ్యానించాడు. బీసీసీఐ ఇలాంటి టోర్నీలను మరింత శ్రద్ధగా జ‌రిపేలా చర్యలు తీసుకోవాలని సూచించాడు. మరోవైపు భారత బోర్డు దేశవాళీ టోర్నీల‌ షెడ్యూల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాఖ్యానించాడు.

Read Also: ఐపీఎల్‌లో RCBకి ఓటేసిన ఫుట్‌బాల్ కెప్టెన్ ఛైత్రి

దేశవాళీ టోర్నీలో భారత సీనియర్ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లను పాల్గొనే చేయాలని ఈ సందర్భంగా గవాస్కర్ అభిప్రాయపడ్డారు. స్టార్ క్రికెటర్లు టోర్నీలో ఆడితే, ఆకర్షణ మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌కు సంబంధించిన ఎటువంటి టోర్నీ అయినా అనాకర్షణీయంగా ఉండకూడదని, దానికి మరిన్ని మెరుగులు దిద్దాలి అని అభిప్రాయ పడ్డాడు. మరోవైపు భారత దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 200 మందికి పైగా పాజిటివ్‌గా తేలారు. నలుగురు మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.