యాప్నగరం

U-19 ప్ర‌పంచ‌క‌ప్ వివాదంపై సచిన్ అసంతృప్తి

గతనెలలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓడిపోయింది. ఈ టోర్నమెంట్‌లో ఇండియా.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది.

Samayam Telugu 25 Feb 2020, 1:59 pm
గతనెలలో సౌతాఫ్రికాలో జరిగిన ఐసీసీ అండ‌ర్‌-19 వ‌న్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగి సంగ‌తి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భార‌త్‌ను మూడు వికెట్ల‌తో ఓడించిన బంగ్లా విశ్వ‌విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్ ముగిశాక ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు సంయ‌మ‌నం కోల్పోయి, బాహాబాహీకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌నపై ఐసీసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు తాజాగా భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ దీనిపై స్పందించాడు. ఇలాంటి సంద‌ర్భాల్లో భావోద్వోగాల‌ను నియంత్రించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని సూచించాడు.
Samayam Telugu Berlin: Sachin Tendulkar poses with the Best Sporting Moment Award during the ...
Sachin Tendulkar


Read Also: RCB: కోహ్లీకి జోడీగా కొత్త ఓపెనర్ ఎవరు?
ఆట‌లో దూకుడును చూపించాలని, బ్యాటింగ్‌లో లేదా బౌలింగ్‌లో అగ్రెష‌న్‌ను చూపిస్తే జ‌ట్టుకు లాభ‌ముంటుంద‌ని స‌చిన్ వ్యాఖ్యానించాడు. అయితే మైదానంలో ఇత‌ర ఆట‌గాళ్ల‌పై దుందుడుకు వైఖ‌రి స‌రికాద‌ని హిత‌వు ప‌లికాడు. ప్ర‌పంచం మొత్తం అంతా చూస్తున్న‌ప్పుడు, దేశానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ ఆటగాళ్ల ప్రవర్తన హుందాగా ఉండాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నాడు.

Read Also: ఆ పోర్న్‌స్టార్‌తో పోల్చుకున్న డాషింగ్ క్రికెటర్
ఇక ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఐసీసీ.. భార‌త్‌కు చెందిన ఇద్ద‌రు ప్లేయ‌ర్లు ఆకాశ్ సింగ్‌, ర‌వి బిష్ణోయ్‌ల‌తోపాటు బంగ్లాకు చెందిన ముగ్గురు ప్లేయ‌ర్లు తోహిద్ హృద‌య్‌, ష‌మీమ్ హుస్సేన్‌, ర‌కిబుల్ హ‌స‌న్ ప్ర‌వ‌ర్త‌న నియామ‌వ‌ళి ఉల్లంఘించిన‌ట్లు తేల్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.