యాప్నగరం

ఆఖరి వన్డేలో అతనే మా టార్గెట్: ఠాకూర్

తొలి రెండు వన్డేల్లోనూ రాస్ టేలర్‌ని ఔట్ చేయలేకపోయిన టీమిండియా.. అతని కారణంగానే ఆఖరికి మ్యాచ్‌ల్ని చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం మూడో వన్డేలో అతడే టీమ్ ఫస్ట్ టార్గెట్ అట.

Samayam Telugu 10 Feb 2020, 8:44 pm
న్యూజిలాండ్‌తో బే ఓవల్ వేదికగా మంగళవారం జరగనున్న ఆఖరి వన్డేలో భారత్ జట్టు స్వేచ్ఛగా చెలరేగిపోనుందని ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ స్పష్టం చేశాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన టీమిండియా.. 0-2తో వెనకబడి ఉంది. దీంతో.. ఇప్పటికే సిరీస్ చేజారిన నేపథ్యంలో.. చివరి వన్డేలో స్వేచ్ఛగా ఆడతామని చెప్పుకొచ్చిన ఠాకూర్.. కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌ని ఔట్ చేయడమే తమ ఫస్ట్ టార్గెట్‌ అని వెల్లడించాడు.
Samayam Telugu Auckland: Indias Shardul Thakur in action during the Twenty/20 cricket internat...


Read More: కోహ్లీకి బలహీనతలు లేవు.. కానీ..?: టిమ్ సౌథీ

‘వన్డే సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనకబడ్డాం. అయినంత మాత్రానా.. చివరి వన్డేని నిర్లక్షం చేయబోం. ఎందుకంటే..? అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి మ్యాచ్‌ కీలకమే. కాకపోతే.. సిరీస్ విజేత నిర్ణయాత్మక మ్యాచ్ కాకపోవడంతో స్వేచ్ఛగా ఆడేస్తాం. ఇక మ్యాచ్‌లో మా టార్గెట్‌ రాస్‌ టేలర్‌ని ఔట్ చేయడమే. తొలి రెండు వన్డేల్లోనూ అతడిని ఔట్ చేసే అవకాశం లభించింది. కానీ.. మేము చేజార్చుకున్నాం. అందుకే.. చివరి వన్డేలో అతడిని ఔట్ చేస్తేనే..? మ్యాచ్‌లో నిలవగలం’ అని శార్ధూల్ ఠాకూర్ వెల్లడించాడు.

Read More: బంగ్లాదేశ్ ‘అతి’ సంబరాలపై ఐసీసీ సీరియస్..?
తొలి వన్డేలో 109 పరుగులతో అజేయంగా నిలిచి కివీస్‌ని గెలిపించిన రాస్ టేలర్.. రెండో వన్డేలోనూ 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ స్లాగ్ ఓవర్లలో భారత బౌలింగ్‌ని టేలర్ ఉతికారేశాడు. అతని దెబ్బకి జస్‌ప్రీత్ బుమ్రా సైతం ధారాళంగా పరుగులిచ్చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.