యాప్నగరం

నల్లరిబ్బన్ ధరించిన భారత ప్లేయర్లు.. ఎందుకంటే..?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడోవన్డేలో భారత క్రికెటర్లు ..ఇటీవల మరణించిన భారత దిగ్గజ స్పిన్నర్ బాపు నాదకర్ణి మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లు ధరించారు. బాపు నెలకొల్పిన రికార్డు అత్యంత అరుదైనదికావడం విశేషం.

Samayam Telugu 19 Jan 2020, 7:41 pm
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత జట్టు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డేలో భారత ఆటగాళ్లందరూ తమ భుజాలకు నల్లటి రిబ్బన్‌ను ధరించి ఆడారు. మరణించిన దిగ్గజ ప్లేయర్‌కు సంతాప సూచకంగా భారత ప్లేయర్లు ఈ రిబ్బన్‌ను ధరించారు. ఆ ప్లేయర్ పేరేమిటంటే.. బాపు నాదకర్ణి..
Samayam Telugu team india


bapu nadkarni


Read Also : మరో మైలురాయి దాటిని రోహిత్.. సచిన్, గంగూలీ కంటే వేగంగా..
టెస్టు క్రికెట్లో బాపు నాదకర్ణికి ప్రత్యేకమైన స్థానముంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా 1961 ఇంగ్లాండ్‌తో టెస్టు సందర్భంగా అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. ఆ మ్యాచ్‌లో బౌలర్లు కలగనే సంచలనాత్మక స్పెల్ (32-27-5-0) వేశారు. 32 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చారు. 27 మెయిడిన్లు వేశారు. ఇందులో వరుసగా 21 మెయిడిన్లు వేశారు. ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగానే ఉంది. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 45 టెస్టులాడిన బాపు.. 88 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆయన ఎకానమీ రేటు కేవలం 1.68 కావడం విశేషం. 50 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసినా వాళ్లలో ఆయనదే బెస్ట్.

Read Also : డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: భారత క్రికెటర్
ఈనెల 17న బాపు మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. నాదకర్ణి మృతిపై భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సహా పలువురు సంతాపం తెలిపారు. ఈక్రమంలో బాపు మరణించడం చాలా బాధకరమని పేర్కొన్న సచిన్, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఆయన రికార్డులు వింటూ పెరిగానని చెప్పుకొచ్చాడు. మరో లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా సంతాపం తెలిపారు. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి అని ఆయన చెబుతుండేవారని సన్నీ తెలిపాడు.

Read Also : కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన లబుషేన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.