ఇంగ్లాండ్ గడ్డపై హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి బుక్ లాంచ్ ఈవెంట్కి హాజరైన భారత క్రికెటర్లు కనీసం మాస్క్ కూడా ధరించలేదని భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి వెల్లడించాడు. ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు ముంగిట రవిశాస్త్రి తన బుక్ని అక్కడ లాంచ్ చేశాడు. ఈ ఈవెంట్కి చాలా మంది వెలుపలి వ్యక్తులతో పాటు భారత క్రికెటర్లు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత మూడు రోజులకే రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా తేలగా.. రోజుల వ్యవధిలోనే ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్ వైరస్ బారినపడ్డారు. టీమిండియా క్యాంప్లో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో.. గత శుక్రవారం భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టుని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రద్దు చేసింది. ఆ పబ్లిక్ ఈవెంట్కి వెళ్లడం ద్వారా రవిశాస్త్రితో పాటు భారత క్రికెటర్లు బయో- సెక్యూర్ నిబంధనల్ని బ్రేక్ చేశారు. అలానే ఈసీబీ నుంచి కనీస అనుమతిని కూడా తీసుకోలేదు. ఆ మ్యాచ్ రద్దుతో ఈసీబీకి వచ్చిన నష్టం సుమారు రూ.40 కోట్లు.
‘‘తాజ్ గ్రూప్ నుంచి ఆహ్వానం లభించడంతో.. ఆ బుక్ లాంచ్ ఈవెంట్కి నేను కూడా హాజరయ్యాను. చాలా మంది వెలుపలి వ్యక్తులతో పాటు భారత క్రికెటర్లు కూడా ఆ ఈవెంట్కి వచ్చారు. చాలా తక్కువ సమయమే జరిగింది. కానీ.. అక్కడికి వచ్చిన భారత క్రికెటర్లు ఎవరూ కనీసం మాస్క్ కూడా ధరించకపోవడం నన్ను షాక్కి గురిచేసింది’’ అని దిలీప్ దోషి వెల్లడించాడు.
‘‘తాజ్ గ్రూప్ నుంచి ఆహ్వానం లభించడంతో.. ఆ బుక్ లాంచ్ ఈవెంట్కి నేను కూడా హాజరయ్యాను. చాలా మంది వెలుపలి వ్యక్తులతో పాటు భారత క్రికెటర్లు కూడా ఆ ఈవెంట్కి వచ్చారు. చాలా తక్కువ సమయమే జరిగింది. కానీ.. అక్కడికి వచ్చిన భారత క్రికెటర్లు ఎవరూ కనీసం మాస్క్ కూడా ధరించకపోవడం నన్ను షాక్కి గురిచేసింది’’ అని దిలీప్ దోషి వెల్లడించాడు.