యాప్నగరం

క‌రోనా ఫైట్‌.. ఇషాంత్ దంప‌తుల భారీ విరాళం

క‌రోనా వైర‌స్ రోజురోజుకు విస్త‌రిస్తున్న వేళ‌.. దీనిపై పోరాటం చేస్తున్న ప్ర‌భుత్వానికి అండ‌గా కొంత‌మంది నిలుస్తున్నారు. తాజాగా భార‌త పేస‌ర్ ఇషాంత్‌.. ఆర్థిక సాయం చేసి, త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు.

Samayam Telugu 2 Apr 2020, 3:28 pm
క‌రోనా వైర‌స్‌పై పోరు జ‌రిపేందుకు అందరూ ముందుకు రావాలని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తాజాగా ఇచ్చిన పిలుపున‌కు అన్ని వైపుల నుంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌ట‌కే క్రీడాకారులు త‌మ‌కు తోచిన విధంగా సాయం చేస్తూ ప‌లువురి మ‌న్న‌న‌లు అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో భార‌త టెస్టు పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ-అతని భార్య ప్ర‌తిమా సింగ్ చేరారు. ప్ర‌ధాన‌మంత్రి సిటిజ‌న్ అసిస్టెన్స్, రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిట్యూవేష‌న్స్ (పీఏం కేర్స్‌)కు రూ.20 ల‌క్ష‌ల భారీ మొత్తాన్ని అందించారు .
Samayam Telugu Ranchi: Indias Ishant Sharma arrives at Birsa Munda International Airport in Ra...
India's Ishant Sharma


Read Also: వరల్డ్‌క‌ప్‌ విజయంపై గంభీర్ ట్వీట్‌..నెటిజ‌న్ల ఫైర్‌



పీఎం కేర్స్‌కు విరాళ‌మిచ్చిన విష‌యాన్ని ట్వీట్ చేసిన ఇషాంత్‌.. ఆప‌త్కాల స‌మ‌యంలో అంద‌రూ ముందుకు వ‌చ్చి చేతనైన సాయం చేయ‌లాని పిలుపునిచ్చాడు. మ‌రోవైపు ఇషాంత్ భార్య ప్ర‌తిమ జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణీ కావ‌డం విశేషం. ప్ర‌తిమా కుటుంబంలో ఐదుగురు టీమిండియా బాస్కెట్‌బాల్‌కు ప్రాతినిథ్యం వ‌హించ‌డం విశేషం.

Read Also: పేద‌ల‌కు గంగూలీ 2 ట‌న్నుల బియ్యం పంపిణీ

మ‌రోవైపు ఈ స‌మ‌యానికిక‌ల్లా ప్ర‌తిష్టాత్మ‌క ఐపీఎల్లో ఇషాంత్ ఆడాల్సి ఉంది. త‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంచైజీ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ఇక ప్ర‌స్తుతం టెస్టుల‌కే ప‌రిమిత‌మైన ఇషాంత్..97 టెస్టుల్లో 297 వికెట్లు తీశాడు. మ‌రో మూడు వికెట్లు తీస్తే 300 వికెట్ల క్ల‌బ్‌లో చేరిన మూడో భార‌త బౌల‌ర్‌గా నిలుస్తాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఘ‌న‌త‌ను క‌పిల్ దేవ్‌, జ‌హీర్ ఖాన్ మాత్రమే సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.