యాప్నగరం

క‌రోనా ఎఫెక్ట్: పుజారా కౌంటీ ఆశ‌లు ఆవిరి

ఈ ఏడాది చివ‌రలో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న వ‌ర‌కు టీమిండియాకు మ‌రే టెస్టు సిరీస్ షెడ్యూలై లేదు. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కౌంటీల్లో ఆడాల‌నుకున్న పుజారాకు షాక్ ఎదురైంది.

Samayam Telugu 9 Apr 2020, 10:54 pm
క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్తంభించిపోయిన సంగ‌తి తెలిసిందే. క్రికెట్ స‌హా ఎన్నో క్రీడా కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డ్డాయి. ఇక ఈ ఏడాది నుంచి ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో అడాల‌నుకున్న భార‌త టెస్టు స్పెష‌లిస్టు చ‌టేశ్వ‌ర్ పుజారా ఆశ‌లు ఆవిర‌య్యాయి. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ ఏడాది త‌మ ఆట‌గాళ్ల కాంట్రాక్టుల‌ను స‌మీక్షించిన‌ట్లు తెలిపిన గ్లూసెస్టర్ షైర్ జ‌ట్టు యాజ‌మాన్యం.. ఈ సీజ‌న్లో పుజారా త‌మ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌బోడ‌ని ప్ర‌క‌టించింది. గ‌త ఫిబ్ర‌వరిలోనే పుజారాతో ఆ టీమ్ ఒప్పందం చేసుకుంది.
Samayam Telugu Christchurch: Indias Cheteshwar Pujara watches the ball while battling during p...
India's Cheteshwar Pujara


Read Also: ఐపీఎల్‌: తప్పులో కాలేసిన ఢిల్లీ.. కోహ్లీని కాదని!

పుజారా కంటే ముందు చాలా కాలం కింద‌ట మ‌రో భార‌త ప్లేయ‌ర్ ఆ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. 1995లో పేస‌ర్ జ‌వ‌గ‌ళ్ శ్రీనాథ్.. ఆ జ‌ట్టు త‌ర‌పున ఆడాడు. సుమారు 25 ఏళ్ల త‌ర్వాత మ‌రో ఇండియ‌న్ ప్లేయ‌ర్ త‌మ టీమ్ త‌ర‌పున ఆడించాలనుకున్న స‌ద‌రు కౌంటీ జ‌ట్టు ప్ర‌ణాళిక‌లు క‌రోనా కార‌ణంగా దెబ్బ‌తిన్నాయి.

Read Also: కోహ్లీతో ఫైట్‌కు అది కారణం కాదు: ఆసీస్ కెప్టెన్

ఇక క‌రోనా వైర‌స్ యూకేలో రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 60 వేల పాజిటివ్ కేసులు తేలాయి. మ‌రోవైపు ఏడువేల మంది చ‌నిపోయారు. ఇక క‌రోనా నేప‌థ్యంలో వ‌చ్చేనెల 28 వ‌ర‌కు క్రికెట్ కార్య‌క‌లాపాల‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.