ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా అశ్విన్.. వరుసగా రెండోసారి భారత ఆటగాడికే అవార్డ్
ICC Player Of the Month: ఇంగ్లాండ్తో సిరీస్లో అటు బ్యాట్తో, ఇటు బంతితో సత్తా చాటిన రవిచంద్రన్ అశ్విన్ ఫిబ్రవరి నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్పై శతకం బాదిన అశ్విన్, ఫిబ్రవరి నెలలో 24 వికెట్లు తీశాడు.
Samayam Telugu 9 Mar 2021, 2:51 pm
ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సత్తా చాటిన టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో 32 వికెట్లు తీసిన అశ్విన్ 189 పరుగులు చేసి సత్తా చాటాడు. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన రవిచంద్రన్.. ప్లేయర్ ఆఫ్ ది మంత్గానూ ఎంపికయ్యాడు.
ఐసీసీ ఈ ఏడాది జనవరి నుంచి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తోంది. తొలి అవార్డును వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీ టెస్టులో 97 పరుగులు చేసిన పంత్.. బ్రిస్బేన్లో జరిగిన చివరి టెస్టులో అజేయంగా 89 పరుగులు బాది జట్టును గెలిపించాడు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ తొలి రెండు అవార్డులను భారత క్రికెటర్లే సొంతం చేసుకోవడం విశేషం.
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవడంతో భారత్ ఒత్తిడికి లోనైంది. రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్ గెలిస్తే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్కు చేరే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కీలకమైన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో శతకం బాదిన అశ్విన్ భారత్ను గెలిపించాడు.
ఈ సిరీస్లో అశ్విన్ 32 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. రెండో టెస్టుతో లాంగ్ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ 27 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకున్న భారత్.. జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదిక న్యూజిలాండ్తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది.
ఐసీసీ ఈ ఏడాది జనవరి నుంచి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తోంది. తొలి అవార్డును వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీ టెస్టులో 97 పరుగులు చేసిన పంత్.. బ్రిస్బేన్లో జరిగిన చివరి టెస్టులో అజేయంగా 89 పరుగులు బాది జట్టును గెలిపించాడు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ తొలి రెండు అవార్డులను భారత క్రికెటర్లే సొంతం చేసుకోవడం విశేషం.
ఈ సిరీస్లో అశ్విన్ 32 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. రెండో టెస్టుతో లాంగ్ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ 27 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకున్న భారత్.. జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదిక న్యూజిలాండ్తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది.