యాప్నగరం

భారత కీపర్లు మరింత నిలకడ సాధించాలి: పార్థీవ్ పటేల్

వికెట్ కీపర్‌ని ఇప్పుడు అన్ని జట్లూ ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తున్నాయి. కీపింగ్‌లో తప్పిదాలు చేసినా సర్దుకుపోతున్న సెలక్టర్లు.. బ్యాటింగ్‌లో ఫెయిలైతే మాత్రం వెంటనే వేటు వేస్తున్నారు.

Samayam Telugu 28 May 2020, 2:02 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించగానే.. అతని స్థానంలో వృద్ధిమాన్ సాహా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కానీ.. వన్డే, టీ20ల్లో ధోనీ తర్వాత ఎవరు..? అంటే అటు భారత సెలక్టర్ల నుంచి ఇటు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి కూడా సరైన సమాధానం వినిపించడం లేదు.
Samayam Telugu రిషబ్ పంత్


Read More: మెంటల్ వచ్చిందా..? ధోనీ రిటైర్మెంట్‌ రూమర్స్‌పై సాక్షి ఫైర్

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా.. అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి వికెట్ కీపర్‌గా వరుసగా అవకాశాలు ఇచ్చారు. ఇందులో రిషబ్ పంత్ ఘోరంగా విఫలమవగా.. కేఎల్ రాహుల్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో కీపర్‌గా అనుభవం లేని రాహుల్ తాత్కాలిక పరిష్కారమే తప్ప.. పర్మినెంట్ కాదని మాజీ క్రికెటర్లు చెప్తున్నారు.

Read More: టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాపై ఆస్ట్రేలియా మెలిక.. ఐసీసీ మౌనం

వన్డే, టీ20ల్లో భారత్ జట్టుకి పర్మినెంట్ కీపర్ లేకపోవడంపై వెటరన్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ మాట్లాడుతూ ‘‘ధోనీ తర్వాత ఇప్పటి వరకూ టీమిండియాకి ఫిక్సిడ్ వికెట్ కీపర్ దొరికాడని నేను అనుకోవట్లేదు. ఇండియా -ఎ జట్టుకి కేఎస్ భరత్.. భారత్ టెస్టు జట్టుకి సాహా ఉన్నాడు. మరి.. టీ20, వన్డేల మాటేమిటి..? నిలకడగా పరుగులు సాధిస్తేనే భారత్ జట్టులో కీపర్‌గా కొనసాగగలరు. ఇంకా చెప్పాలంటే.. భారత్ జట్టులో కీపర్ ఆల్‌రౌండర్‌గా ఉండాలి. ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్ తరహాలో పరుగులు రాబడుతూ.. కీపింగ్ చేయగలిగినప్పుడే.. టీమ్‌లో కొనసాగుతారు’’ అని పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.