యాప్నగరం

ప్రపంచకప్‌కి భారత మహిళా జట్టు ఎంపిక

వెటరన్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ కెప్టెన్‌గా కొనసాగించిన సెలక్టర్లు.. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు

TNN 15 May 2017, 10:01 pm
జూన్ 24 నుంచి ఆరంభంకానున్న ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ కోసం భారత్ జట్టును సోమవారం రాత్రి బీసీసీఐ ఎంపిక చేసింది. వెటరన్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ కెప్టెన్‌గా కొనసాగించిన సెలక్టర్లు.. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్‌లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటి వరకు ఒకసారి కూడా ప్రపంచకప్ గెలవని భారత్ ఈ సారి భారీ అంచనాల నడుమ బరిలోకి దిగనుంది. 2005లో ఫైనల్ చేరిన భారత్ అక్కడ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో భారత్‌ది అదే అత్యుత్తమ ప్రదర్శన. జులై 23న ఫైనల్ జరగనుంది.
Samayam Telugu indian womens squad named for 2017 cricket world cup
ప్రపంచకప్‌కి భారత మహిళా జట్టు ఎంపిక


భారత్ జట్టు
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, వేదా క్రిష్ణమూర్తి, మోనా మేశ్రం, పూనమ్ రౌత్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిస్త, సుష్మా వర్మ, మన్షీ జోషి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, పర్వీన్, స్మృతి మంద‌న‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.