టీ20 వరల్డ్కప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్కి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వబోతుండగా.. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకూ మొత్తం 45 మ్యాచ్లు జరగనున్నాయి. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ జట్టు గ్రూప్-2లో ఉంది. టీమిండియాతో పాటు ఈ గ్రూప్లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అలానే మరో రెండు జట్లు ఫస్ట్ రౌండ్లో ఆడి సూపర్-12కి అర్హత సాధించడం ద్వారా ఈ గ్రూప్లోకి రానున్నాయి. ఈ రెండింటిలో వెస్టిండీస్ లేదా శ్రీలంక జట్లలో ఒకటి ఉండనుంది. సూపర్-12లో భాగంగా భారత్ జట్టు (గ్రూప్ దశలో) ఐదు మ్యాచ్లను ఆడనుంది.
1. భారత్, పాకిస్థాన్ మధ్య అక్టోబరు 23న మెల్బోర్న్లో మ్యాచ్ (మెల్బోర్న్)
2. భారత్, గ్రూప్-A రన్నరప్ మధ్య అక్టోబరు 27న మ్యాచ్ (సిడ్నీ)
3. భారత్, దక్షిణాఫ్రికా మధ్య అక్టోబరు 30న మ్యాచ్ (పెర్త్)
4. భారత్, బంగ్లాదేశ్ మధ్య నవంబరు 2న మ్యాచ్ (అడిలైడ్)
5. భారత్, గ్రూప్-బి విన్నర్ మధ్య నవంబరు 6న మ్యాచ్ (మెల్బోర్న్)
ఐసీసీ టీ20 వరల్డ్కప్లో ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఆరు సార్లు తలపడగా.. భారత్ జట్టు ఐదు మ్యాచ్ల్లో. .పాకిస్థాన్ ఒక మ్యాచ్లో విజయం సాధించింది. అది కూడా 2021 టీ20 వరల్డ్కప్లో భారత్ జట్టుని 10 వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్.. వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి భారత్పై గెలుపురుచి చూసింది. దాంతో.. ఇన్నాళ్లు అజేయ రికార్డుతో పూర్తి ధీమాతో బరిలోకి దిగుతూ వచ్చిన టీమిండియాపై ఈసారి ఒత్తిడి ఉండనుంది. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్లోనే పాకిస్థాన్ని భారత్ జట్టు ఓడించగలిగితే? ఇక టోర్నీలో సెమీస్ వరకూ టీమిండియాకి తిరుగుండదు. టీ20 వరల్డ్కప్ 2021లో ఫస్ట్ మ్యాచ్లోనే పాక్ చేతిలో ఓడిన భారత్.. గ్రూప్ దశలోనే ఇంటిబాటపట్టిన విషయం తెలిసిందే.
1. భారత్, పాకిస్థాన్ మధ్య అక్టోబరు 23న మెల్బోర్న్లో మ్యాచ్ (మెల్బోర్న్)
2. భారత్, గ్రూప్-A రన్నరప్ మధ్య అక్టోబరు 27న మ్యాచ్ (సిడ్నీ)
3. భారత్, దక్షిణాఫ్రికా మధ్య అక్టోబరు 30న మ్యాచ్ (పెర్త్)
4. భారత్, బంగ్లాదేశ్ మధ్య నవంబరు 2న మ్యాచ్ (అడిలైడ్)
5. భారత్, గ్రూప్-బి విన్నర్ మధ్య నవంబరు 6న మ్యాచ్ (మెల్బోర్న్)
ఐసీసీ టీ20 వరల్డ్కప్లో ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఆరు సార్లు తలపడగా.. భారత్ జట్టు ఐదు మ్యాచ్ల్లో. .పాకిస్థాన్ ఒక మ్యాచ్లో విజయం సాధించింది. అది కూడా 2021 టీ20 వరల్డ్కప్లో భారత్ జట్టుని 10 వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్.. వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి భారత్పై గెలుపురుచి చూసింది. దాంతో.. ఇన్నాళ్లు అజేయ రికార్డుతో పూర్తి ధీమాతో బరిలోకి దిగుతూ వచ్చిన టీమిండియాపై ఈసారి ఒత్తిడి ఉండనుంది. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్లోనే పాకిస్థాన్ని భారత్ జట్టు ఓడించగలిగితే? ఇక టోర్నీలో సెమీస్ వరకూ టీమిండియాకి తిరుగుండదు. టీ20 వరల్డ్కప్ 2021లో ఫస్ట్ మ్యాచ్లోనే పాక్ చేతిలో ఓడిన భారత్.. గ్రూప్ దశలోనే ఇంటిబాటపట్టిన విషయం తెలిసిందే.