యాప్నగరం

సిరీస్ చేజారినా.. భారత్‌ ‘నెం.1’ పదిలం

దక్షిణాఫ్రికాతో శుక్రవారం నుంచి జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్‌నకు గురైనా నెం.1 ర్యాంక్‌లోనే కొనసాగనుంది. కేప్‌ టౌన్

TNN 4 Jan 2018, 1:26 pm
దక్షిణాఫ్రికాతో శుక్రవారం నుంచి జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్‌నకు గురైనా నెం.1 ర్యాంక్‌లోనే కొనసాగనుంది. కేప్‌ టౌన్ వేదికగా రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి తొలి టెస్టు ప్రారంభకానుంది. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ జట్టు 124 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 111 పాయింట్లతో దక్షిణాఫ్రికా ద్వితీయ స్థానంలో ఉంది. తర్వాత వరుసగా ఇంగ్లాండ్ (105), న్యూజిలాండ్ (100), ఆస్ట్రేలియా (97) టాప్-5లో కొనసాగుతున్నాయి.
Samayam Telugu indias no 1 test ranking under no threat even if south africa sweep series
సిరీస్ చేజారినా.. భారత్‌ ‘నెం.1’ పదిలం


భారత్ జట్టు ఒకవేళ సిరీస్‌ని 0-3తో చేజార్చుకుంటే.. ఆరు పాయింట్లలో కోత పడి 118 పాయింట్లకి చేరుతుంది. మరోవైపు సొంతగడ్డపై, నెం.1 జట్టుగా ఉన్న భారత్‌ని క్లీన్‌స్వీప్ చేయడంతో దక్షిణాఫ్రికా ఖాతాలో ఏడు పాయింట్లు చేరనున్నాయి. దీంతో ఇరు జట్లు 118 పాయింట్లతో సమానంగా నిలిచినా.. దశాంశాల పరంగా దక్షిణాఫ్రికా 117.53తో పోలిస్తే భారత్‌ జట్టే 118.47తో మెరుగ్గా ఉండనుంది. కాబట్టి.. ఒకవేళ సిరీస్‌‌లో భారత్ వైట్‌వాష్‌కి గురైనా.. నెం.1 ర్యాంక్‌ మాత్రం పదిలంగా ఉంచుకోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.