యాప్నగరం

భారత్ జట్టు శ్రీలంక పర్యటన ఖరారు

ప్రపంచకప్ 2019కి నేరుగా అర్హత సాధించాలని ఆశిస్తున్న వెస్టిండీస్‌ జట్టుతో భారత్ జూన్ 23 నుంచి ఐదు వన్డేలు

TNN 20 Jun 2017, 5:58 pm
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నిరాశపరిచిన భారత్ మూడు నెలల పాటు ఎడతెరపి లేని క్రికెట్ ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన కోసం ఇప్పటికే కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. అక్కడ సిరీస్ ముగిసిన అనంతరం శ్రీలంక‌కి వెళ్లనుంది. అక్కడ లంకేయులతో మూడు టెస్టులు, ఐదు వన్డేలతో పాటు ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది.
Samayam Telugu indias tour of sri lanka
భారత్ జట్టు శ్రీలంక పర్యటన ఖరారు


ప్రపంచకప్ 2019కి నేరుగా అర్హత సాధించాలని ఆశిస్తున్న వెస్టిండీస్‌ జట్టుతో భారత్ జూన్ 23 నుంచి ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వన్డే ర్యాంకింగ్ మెరుగ్గా లేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడే అవకాశాన్ని చేజార్చుకున్న కరీబియన్లు.. టీమిండియాపై వన్డే సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

వెస్టిండీస్‌తో సిరీస్ జులై 9న ముగియనుండగా.. జులై 26 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభంకానుంది. తొలుత టెస్టులు, తర్వాత ఆగస్టు 20 నుంచి వన్డేలు, చివర్లో సెప్టెంబరు 6న టీ20 మ్యాచ్‌తో పర్యటన ముగియనుంది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలో భారత్‌పై శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.