యాప్నగరం

వైజాగ్ టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్

ఐదో రోజు భారత బౌలర్లు సత్తా చాటడంతో వైజాగ్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై కోహ్లిసేనకు తిరుగు లేదని నిరూపించుకుంది.

TNN 21 Nov 2016, 1:16 pm
వైజాగ్ టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ రాణించడంతో 246 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసిన పర్యాటక జట్టు.. ఐదో రోజు ఏ మాత్రం పోరాడలేకపోయింది. భారత బౌలర్లు రాణించడంతో 158 పరుగులకే కుప్పకూలింది. ఐదో రోజు స్కోరు బోర్డుపై మరో ఐదు పరుగులు జత కాగానే ఇంగ్లండ్ జట్టు డకెట్ వికెట్‌ను కోల్పోయింది. అది మొదలు ఇంగ్లండ్ పతనం కొనసాగింది.
Samayam Telugu indvseng india beat england by 246 runs in vizag test
వైజాగ్ టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్


టీమిండియా బౌలర్లు విజృంభించడంతో ఐదో రోజు క్రీజులోకి అడుగుపెట్టిన ఆటగాళ్లలో బెయిర్‌స్టౌ మినహా మరే ఇతర ఆటగాడు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్, జయంత్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. షమీ, జడేజాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ​ ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు 8 వికెట్లు దక్కాయి. తొలి రెండు వికెట్లతో 60 ఓవర్ల పాటు పోరాడిన ఇంగ్లండ్, చివరి 8 వికెట్లను 37 ఓవర్లలోనే చేజార్చుకోవడం గమనార్హం.

గతేడాది ఆగష్టు 15 నుంచి భారత జట్టు ఇప్పటి వరకూ 15 టెస్టులు ఆడగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది, మిగతా నాలుగు డ్రాగా ముగిశాయి. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా అశ్విన్ అవతరించాడు. అశ్విన్‌కు ఈ క్యాలెండ్ ఇయర్‌లో 55 వికెట్లు దక్కగా, శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ 54 వికెట్లు తీశాడు.


కోహ్లి నాయకత్వంలో భారత జట్టు 19 టెస్టులు ఆడగా.. 11 విజయాలు సాధించి కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిపాలైంది. సొంత గడ్డపై 9 టెస్టులు ఆడిన కోహ్లి సేన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం.

స్కోరు బోర్డు:
భారత్: 455, 204
ఇంగ్లండ్: 255, 158

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.