శ్రీలంక క్రీడల మంత్రిని కోతితో పోల్చి ఆ దేశ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ చిక్కుల్లో పడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పేలవ ప్రదర్శన కారణంగా శ్రీలంక ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇచ్చిన రెండు సులవైన క్యాచ్ల్ని ఫీల్డర్లు వదిలేయడంతో శ్రీలంకకి ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్ అనంతరం శ్రీలంక జట్టులోని కొంత మందికి ఫిటెనెస్ లేదంటూ క్రీడల మంత్రి జయశేఖర విమర్శించారు. దీనిపై మలింగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అలాంటి విమర్శలను నేను పట్టించుకోను. వారు శాసించే స్థానంలో ఉన్నా నాకు భయం లేదు. అయినా చెట్టు తొర్రలో చిలుక ఏర్పాటు చేసుకున్న గూడు గురించి కోతికి ఏం తెలుస్తుంది..? ఆయన విమర్శ కూడా ఎలా ఉందంటే.. ఆ చిలక గూడులోకి దౌర్జన్యంగా దూరి కోతి మాట్లాడినట్లుంది’ అని మలింగ ఎద్దేవా చేశాడు.
ఈ మాటలపై ఘాటుగా స్పందించిన మంత్రి.. బౌలర్ మలింగ మాటలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. ‘నా విమర్శ కేవలం ఆటగాళ్ల ఫిటెనెస్ ప్రమాణాల గురించే. నేను ఎక్కడా మలింగ పేరును ప్రస్తావించలేదు. కానీ.. అతను మాత్రం నాపై బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. ఆటగాళ్ల కొవ్వు శాతం సాధారణంగా 16 శాతానికి మించకుండా ఉండాలి. కానీ.. శ్రీలంక జట్టులోని చాలా మందికి 25 శాతం మించి ఉంది. భవిష్యత్లో ఈ ఫిటెనెస్ ప్రమాణాలు పాటించని వారికి జట్టులో స్థానం ఉండదు’ అని మంత్రి హెచ్చరించారు.
ఈ మ్యాచ్ అనంతరం శ్రీలంక జట్టులోని కొంత మందికి ఫిటెనెస్ లేదంటూ క్రీడల మంత్రి జయశేఖర విమర్శించారు. దీనిపై మలింగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అలాంటి విమర్శలను నేను పట్టించుకోను. వారు శాసించే స్థానంలో ఉన్నా నాకు భయం లేదు. అయినా చెట్టు తొర్రలో చిలుక ఏర్పాటు చేసుకున్న గూడు గురించి కోతికి ఏం తెలుస్తుంది..? ఆయన విమర్శ కూడా ఎలా ఉందంటే.. ఆ చిలక గూడులోకి దౌర్జన్యంగా దూరి కోతి మాట్లాడినట్లుంది’ అని మలింగ ఎద్దేవా చేశాడు.
ఈ మాటలపై ఘాటుగా స్పందించిన మంత్రి.. బౌలర్ మలింగ మాటలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. ‘నా విమర్శ కేవలం ఆటగాళ్ల ఫిటెనెస్ ప్రమాణాల గురించే. నేను ఎక్కడా మలింగ పేరును ప్రస్తావించలేదు. కానీ.. అతను మాత్రం నాపై బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. ఆటగాళ్ల కొవ్వు శాతం సాధారణంగా 16 శాతానికి మించకుండా ఉండాలి. కానీ.. శ్రీలంక జట్టులోని చాలా మందికి 25 శాతం మించి ఉంది. భవిష్యత్లో ఈ ఫిటెనెస్ ప్రమాణాలు పాటించని వారికి జట్టులో స్థానం ఉండదు’ అని మంత్రి హెచ్చరించారు.