యాప్నగరం

ఆర్చర్ జ్యోతి సురేఖను అభినందించిన ఏపీ సీఎం జగన్

ప్రముఖ తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఆమెను సీఎం శాలువాతో సన్మానించారు.

Samayam Telugu 31 Dec 2019, 5:21 pm
అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతున్న తెలుగు ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం అభినందించారు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సురేఖ ఏకంగా నాలుగు పతకాలు సాధించింది. ఈక్రమంలో సీఎం జగన్‌‌ను సురేఖ కలిసి తన సాధించిన విజయాల గురించి వివరించింది.
Samayam Telugu ap cm with jyothi.


Read Also :IPL 2020: KKRకి గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు ఔట్
తనను కలిసిన సురేఖను శాలువ కప్పి జగన్ సన్మానించారు. ఈ సందర్భంగా సురేఖ తను సాధించిన పతకాల గురించి ముఖ్యమంత్రికి చూపించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రవాణ, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమావేశంలో పాల్గొన్నారు.

Read Also : సెహ్వాగ్‌లా క్రమశిక్షణ ఉంటే బాగుండేది: శ్రీకాంత్
2019 సంవత్సరంలో జ్యోతి సురేఖ పలు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. ముందుగా వరల్లడ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. అలాగే అదే ఈవెంట్‌ కాంపౌండ్ టీమ్ విభాగంలోనూ కాంస్యాన్ని దక్కించుకున్నారు. ఇక బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్‌ను దక్కించుకుని రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

Read Also : జడేజా వివాదంపై పెదవివిప్పిన మంజ్రేకర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.