యాప్నగరం

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్-10లో ఇద్దరే

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తేలిపోయారు. బౌలింగ్, ఆల్‌రౌండర్ల జాబితాలో కనీసం ఒక్కరు కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. బ్యాటింగ్‌లో మాత్రం ఇద్దరికి చోటు దక్కింది.

Samayam Telugu 27 Feb 2020, 5:20 pm
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత క్రికెటర్లకి మాత్రమే మెరుగైన స్థానాలు దక్కాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో నిలకడగా రాణించిన కేఎల్ రాహుల్‌ 823 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. ఆ సిరీస్‌లో తేలిపోయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవంగా 673 పాయింట్లతో 10వ ర్యాంక్‌తో సరిపెట్టాడు. ఈ ఇద్దరూ మినహా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ల జాబితాలో ఏ భారత క్రికెటర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.
Samayam Telugu Rajkot: Indian batsman KL Rahul and Virat Kohli run between the wickets during t...


Read More: undefined

బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 879 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (823), అరోన్ ఫించ్ (820), కొలిన్ మున్రో (785), గ్లెన్ మాక్స్‌వెల్ (721) టాప్-5లో నిలిచారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ 749 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో అఫ్గానిస్థాన్‌కే చెందిన మహ్మద్ నబీ 319 పాయింట్లతో నెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు.

Read More: IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ మార్పు

తాజా ర్యాంకింగ్స్‌లో ఎక్కువ స్థానాల్ని పైకి ఎగబాకిన క్రికెటర్‌గా ఆస్ట్రేలియా స్పిన్నర్ అస్టన్ అగర్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో హ్యాట్రిక్ వికెట్లని నమోదు చేయడంతో పాటు మొత్తంగా 8 వికెట్ల పడగొట్టిన అగర్ ఆరు స్థానాలు ఎగబాకి 4వ ర్యాంక్‌లో నిలిచాడు. అతని నాలుగేళ్ల కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.