యాప్నగరం

రూ. కోటి వివాదంపై ఇంజిమామ్ ఫైర్..!

క్రికెటర్లందరికీ రూ. కోటి చొప్పున ఇవ్వడాన్ని సమర్థించిన వారు.. చీఫ్ సెలక్టర్‌కి అంత ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.

TNN 8 Jul 2017, 4:12 pm
ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ గెలిచిన పాకిస్థాన్ జట్టుకి నజరానా ప్రకటించిన ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్.. జట్టు చీఫ్ సెలక్టర్‌ ఇంజిమామ్‌ ఉల్ హక్‌‌కి కూడా రూ. కోటి రివార్డు ప్రకటించడంతో చెలరేగిన వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఇంజిమామ్‌తో పాటు సెలక్టర్లుగా ఉన్న సభ్యులకి కేవలం రూ. 10 లక్షలు మాత్రమే అందజేయడంపై మాజీ సెలక్టర్లు, క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులోని క్రికెటర్లందరికీ రూ. కోటి చొప్పున ఇవ్వడాన్ని సమర్థించిన వారు.. చీఫ్ సెలక్టర్‌కి అంత ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై తాజాగా ఇంజిమామ్ స్పందించారు.
Samayam Telugu inzamam ul haq slams critics for questioning his cash award
రూ. కోటి వివాదంపై ఇంజిమామ్ ఫైర్..!


‘సెలక్టర్లకి ఇంత ఇవ్వాలని మేము అడగలేదు. కానీ.. ప్రభుత్వం ప్రకటించిన నజరానాపై ఇంత రచ్చ చేయడం చాలా నిరాశ కలిగిస్తోంది. ఇది అర్థంలేని వివాదం. జట్టుగా పాక్ ప్రదర్శన మెరుగవడానికి సెలక్టర్ల పాత్ర చాలా ఉంది. గత ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ అద్భుతంగా ఆడింది. అనంతరం వెస్టిండీస్‌ గడ్డపై 70 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచింది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ‌లో తొలిసారి విజేతగా నిలిచింది. ఇదంతా సరైన జట్టుని సెలక్టర్లు ఎంచుకోవడంతోనే సాధ్యమైంది’ అని ఇంజిమామ్ వివరించాడు. సెలక్టర్ల సూచన మేరకే ఇటీవల సర్ఫరాజ్ ఖాన్‌ని టెస్టు జట్టు కెప్టెన్‌గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించిందని ఆయన స్పష్టం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.