యాప్నగరం

వారి గుండెల్లో విరాట్ కోహ్లి నిలిచిపోయాడు...!

ప్రతిపాదనను గవర్నింగ్ కౌన్సిల్‌ ముందు తాను ఉంచగా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. 2015తో పోలిస్తే.. 2016 సీజన్‌లో

TNN 3 Apr 2017, 7:11 pm
ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌లో మైమరపించే ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానుల గుండెల్లో పదిలంగా నిలిచిపోయాడని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కొనియాడారు. బుధవారం నుంచి ఐపీఎల్ పదో సీజన్ ఆరంభంకానున్న నేపథ్యంలో టోర్నీ ఏర్పాట్లపై మీడియాతో శుక్లా మాట్లాడారు. ఈ ఏడాది ఎనిమిది వేదికల్లో ఆరంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.. ఈ ప్రతిపాదనను గవర్నింగ్ కౌన్సిల్‌ ముందు తాను ఉంచగా అందరూ ఏకగ్రీవంగా ఒప్పకున్నట్లు ఆయన వివరించారు. 2015తో పోలిస్తే.. 2016 సీజన్‌లో ఐపీఎల్‌ని వీక్షించిన వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని ఛైర్మన్ వివరించారు.
Samayam Telugu ipl 2017 to have 8 separate opening ceremonies
వారి గుండెల్లో విరాట్ కోహ్లి నిలిచిపోయాడు...!


‘విరాట్ కోహ్లి గత ఏడాది తన ప్రదర్శనతో అశేష ప్రేక్షకుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టాడు. అతనొక్కడే కాదు.. చాలా మంది యువ క్రికెటర్లు తమ ఆటతో మెప్పించారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, చాహల్, బెన్ కట్టింగ్, ఆడమ్ జంపా తదితర క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ఇక దేశవ్యాప్తంగా ఐపీఎల్ 2015 సీజన్‌ని 19 కోట్ల మంది వీక్షించగా... గత ఏడాది అనూహ్యంగా ఆ సంఖ్య 39.6 కోట్లకి చేరింది. ఈ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఐపీఎల్ వేగంగా ఆదరణ పొందుతోందని ఈ లెక్కలే చెప్తున్నాయి. ఆరంభోత్సవ వేడుకల్ని ఎనిమిది చోట్ల నిర్వహించాలని నేనే ప్రతిపాదించా. సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ప్రతి జట్టు సొంతవేదికపై ఈ కార్యక్రమం ద్వారా అభిమానులకి మరింత చేరవవుతుందని నా ఉద్దేశం’ అని శుక్లా వివరించారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య ఉప్పల్ వేదికగా జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.